యూఏఈ లో భారతీయుడికి
భారీ జరిమానా విధించింది..అయితే ఆ భారీ జరిమానా చుసిన అతను ఇప్పుడు లబోమంటున్నాడు..వివరాలలోకి
వెళ్తే..యూఏఈ(యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రవాణా విభాగాన్ని
విమర్శిస్తూ ఇ-మెయిల్ పెట్టినందుకు ఓ భారతీయ కార్మికుడికి కళ్ళు బైర్లు కమ్మే జరిమానా విధించింది..దాదాపు రూ.87లక్షల భారీ జరిమానా విధించింది ఆ దేశం.
సదరు భారతీయ యువకుడు..డ్రైవింగ్ లైసెన్స్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని కారణంగా ఆ భారతీయ కార్మికుడు..విమర్శలతో కూడిన మెయిల్ను రవాణా విభాగానికి ఇ మెయిల్ చేశాడు...కావాలనే పేదలని అర్హత పరిక్షలలో ఫెయిల్ చేసి డబ్బులు గుంజుతోందని విమర్శించాడు..
అయితే ఈ సమయంలోనే ఆ 25 కుర్రాడు అన్న మాటలు తమను అవమానించేలా..ఉన్నాయని అందుకు నిదర్సనం తానూ పంపిన మెయిల్ అని రవాణా విభాగం పోలీసు ఉన్నత అధికారులకి ఫిర్యాదు చేసింది..నిందితుడు నేరం అంగీకరించకపోయినా..దుబాయ్ కోర్టు 3 నెలలు జైలు శిక్ష ఖరారు చేసింది...అక్కడితే ఆగకుండా రూ. 87లక్షల జరిమానా కూడా విధించింది...అంతేకాదు శిక్ష పూర్తీ అవ్వగానే దేశం నుంచీ పంపేయాలని ఆదేశించింది.