ఎప్పుడు ఎవరి దశ ఎలా తిరుగుతుందో
తెలియదు..అప్పటి వరకూ కటిక దరిద్రం అనుభవించే వారు సైతం బెంజ్ కార్లలో కూడా
తిరుగుతారు అయితే ప్రతీ దానికి లక్కు ఉండాలి కూడా అయితే ఎన్నో సందర్భాలు ఈ విషయాన్ని
ప్రూవ్ చేశాయి..తాజాగా దుబాయ్ లో భారతీయ కార్మికుడికి కూడా అదృష్టం
కలిసొచ్చింది..అదృష్టం అంటే అలాంటి ఇలాంటి అదృష్టం కాదు..ఏకంగా 10 లక్షల డాలర్లు
అనే సుమారు మన రూపాయల్లో చెప్పాలంటే ఆరున్నర కోట్లు..అసలు అంత డబ్బు ఎలా వచ్చింది
ఏమా లాటరీ అనుకుంటున్నారా..? వివరాలలోకి వెళ్తే..
పోట్టికూటికోసం దుబాయికి వెళ్లిన ప్రవాసుల్లో ఎంతో మంది భారతీయులు ఉన్నారు..ఒక పక్క ఉపాది చేసుకుంటూనే మరో పక్క తమ తమ అదృష్టాన్ని లాటరీల రూపంలో పరీక్షించుకునే వారు ఉన్నారు ఒక్కో సారి కొందరి దశ ఒక్కసారిగా మారిపోతోంది.లాటరీ డ్రాల ద్వారా ఒక్కసారిగా కోటీశ్వరులయిపోతున్నవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా షార్జాలో పనిచేసే ఓ భారతీయ మెకానిక్ జాక్పాట్ లాటరీ కొట్టాడు. కేరళకు చెందిన 36ఏళ్ల పింటో పాల్ తొమ్మన అనే మెకానిక్కు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిల్లేనియం మిలియనీరు లాటరీ తగిలింది.
దాంతో ఒక్క సారిగా అతని స్టార్ మారిపోయింది..ఒక్క సారిగా ఆరున్నర కోట్లు గెలుచుకున్న అతని ఆనందానికి అవధుల్లేవు. అయితే లాటరీ టిక్కెట్ కొనడంలో సగం సొమ్ము తన స్నేహితుడు ఇచ్చినందుకు సొమ్ము లో సగం అంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు తన స్నేహితుడికి ఇవ్వనున్నాడు..తామిద్దరం చిన్ననాటి స్నేహితులం అని ఈ అదృష్టంలో సగం నా స్నేహితుడిది అని తెలిపాడు..అదృష్టం అంటే అతనిదేగా మరి..