భారతీయ ఎన్నారై కుటుంభ అదృశ్యం ఇప్పుడు అమెరికాలో సంచలనం కలిగిస్తోంది..భారత్ లో తెలుగు రాష్ట్రానికి చెందిన తోటపల్లి సందీప్ మరియు ఆయన భార్య సౌమ్య , వారి ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచిలు అకస్మాత్తుగా కనిపిచకుండా పోయారు..వారు ఏప్రిల్ 5 వ తేదీన తమ హోండా పైలెట్ కారులో పోర్ట్లాండ్ నుంచి శాన్జోష్ వెళ్తూ ఒక్కసారిగా కనిపించకుండా పోయారు అని అమెరికా మీడియా ప్రకటించింది..
అయితే అదే సమయంలో అంటే ఏప్రిల్ 6న ఈల్ నదిలోవరదలు వచ్చాయని ఆ వరదల్లో ఒక కారు కొట్టుకుని పోయిందని అయితే ఆ కారు ఆ భారతీయుల కారులాగానే ఉందని హైవే పెట్రోలింగ్ అధికారి..తెలిపారు..అయితే విచారణలో భాగంగా కొంతమంది సాక్షులని విచారించగా వరదల్లో కొట్టుకుపోయిన కారు 2016 లేదా 2017లో విడుదలైన హోండా కారుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం కారును గుర్తించే పనిలో ఉన్నామని, కానీ ఇప్పటి వరకూ ఆచూకీ దొరకలేదని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదిలాఉంటే ఈల్ నదిలో కొట్టుకుని పోయిన కారు సందీప్ కారు ఈల్ నదిలో కూడా కొట్టుకుపోయిన కారు ఒకే విధంగా ఉన్నాయని, కానీ ఖచ్చితంగా నిర్ధారించలేమని..అక్కడ అధికారులు చెప్తున్నారు..వారి ఆచూకీ తెలియగానే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని తెలిపారు..అయితే ఈ మొత్తం ఘటనపై వివరణ ఇవ్వాలని భారత విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారిని ఆదేశాలు జారీచేశారు..