భారతీయులు
ఎక్కడ ఉన్నా సరే తమ ప్రతిభా ఫాటవాలు నలుదిక్కులా చాటుతారు..కేవలం ఉద్యోగ, వ్యాపార
,విద్యా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో సైతం
చక్రం తిప్పగలమని చాటి చెప్తున్నారు తాజాగా ఇంగ్లాండ్ లో జరిగిన ఎన్నికలే అందుకు
నిదర్సనం అయితే పరాయి గడ్డపై అక్కడి వ్యక్తులపై పోటీ చేసి గెలవడం అంటే మామూలు
విషయం కాదు అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో
భీమవరానికి చాందిన యువకుడు ఆ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాడు వివరాలలోకి
వెళ్తే..
దేశ విదేశాలలో జరిగే ఎన్నో ఎన్నికలలో భారతీయులు మన సత్తా చాటుతూనే ఉన్నారు అమెరికాలో సైతం కీలక పదవులని అలంకరిస్తున్నారు.. అయితే తాజాగా ఇంగ్లండ్లోని హాలండ్ కార్పొరేషన్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికలలో భీమవరం యువకుడు సత్తా చాటాడు..ప్రఖ్యాత రాయల్ వార్డు నుంచి అధికార కన్సర్వేటివ్ పార్టీ తరఫున ఆరేటి ఉదయ్ గెలుపొందారు..దాంతో మరో సారి..భారతీయుల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది ..
ఇంగ్లాండ్ లో జరిగిన ఈ ఎన్నికలలో ఉదయ్ లేబర్పార్టీకి చెందిన కెల్లీపై ఆయన విజయం సాధించారు...అసలు ఈ ఎన్నికలు ఏప్రిల్ ఒకటో తేదీన జరగాల్సి ఉండగా మే నెల నాలుగో తేదీన ఫలితాలు వెల్లడించారు.... ఇదిలాఉంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషిశునాక్ కేబినెట్ మంత్రిగా ఉంటూ ఉదయ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లుగా తెలిపారు...ఉదయ్ ఈ పదవిలో నాలుగేళ్లపాటు కొనసాగుతారు ఉదయ్ తండ్రి భీమవరం లోని ఒక కాలీజీలో ప్రిసిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు.