భారత ఎన్నారైలు మరో ఘనత
సాధించారు ఎప్పుడు ఎదో ఒక కార్యక్రమం ద్వారా విదేశాలలో వార్తల్లో నిలిచే మన వాళ్ళు
ఈ సారి కూడా మరో విషయంలో టాప్ లిస్టు కి ఎక్కారు..వీసాల విషయంలో మాత్రమే కాదు
సంపాదించే సొమ్ములో కొంత బాగం ఇంటికి పంపడం లో సైతం టాప్ లిస్టు లో
చేరిపోయారు..వివరాలలోకి వెళ్తే... తాజాగా వెలువడిన ఒక నివేదికలో సైతం భారత
ఎన్నారైలె ముందు నిలిచారట..మరి ఆనివేదిక ఏమిటంటే.. విదేశాల్లో ఎంతో కష్టపడి పని చేసుకుని సంపాదిస్తున్న సొమ్ముని భారత
ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్నారు
ఇలా గత ఏడాది అంటే 2017 వీరు పంపించిన మొత్తం 6,900 కోట్ల డాలర్లు...ఇండియన్ రూపీస్ లో చెప్పాలంటే దాదాపు రూ.4.62 లక్షల కోట్లకు సమానం..ఈ విషయాన్ని అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్ఎడి) తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది ప్రవాసుల నుంచి ఏటా ఇలా అత్యధిక నిధులు అందుకుంటున్న దేశాల్లో భారత్ తర్వాత చైనా 6,400 కోట్ల డాలర్లు, ఫిలిప్పీన్స్..3,300 కోట్ల డాలర్లు..పాకిస్థాన్ 2,000 కోట్ల డాలర్లు..వియత్నాం 1,400 కోట్ల డాలర్లు దేశాలు ఉన్నాయి.
ఇంతకీ ఈ సొమ్ము అధికంగా ఎక్కడి నుంచీ ఇండియన్స్ పంపుతున్నారో ఎక్కడికి పంపుతున్నారు..అనే విషయాలు సైతం వెల్లడించారు..ఎక్కువగా దుబాయి కంట్రీస్ నుంచీ ఈ డబ్బ్బు అధికంగా ఉంటోంది..అంతేకాదు ఎన్నారైలు ఎక్కువగా ఈ డబ్బుని పంపేది గ్రామీణ ప్రాంతాలకి అని చెప్పారు..ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా డబ్బు సంపాదనకి అరబ్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు.