తమదేశంలోకి ప్రవేశించే
మైనర్ల విషయంలో యూఏఈ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటోంది..ఎన్నో దేశాల నుంచీ ఎంతో మంది
వివిధరకాల పనుల నిమిత్తం లేదా పర్యాటక వీక్షణ నిమిత్తం గాని మరే ఇతరకారణాల వలన
వచ్చే వాళ్ళు ఇక మీదట తప్పకుండ తమ నిభంధనలకి లోబడి ఉండాలని తెలిపింది..అయితే
మైనర్ల విషయంలో మాత్రం ఎట్టిపరిస్థితిలో రాజీ పడే సమస్యలేదన తేల్చి చెప్పేసింది..
మైనర్లు తమ తల్లి తండ్రులతో కాకుండా బయటకి వెళ్ళాలంటే తప్పకుండా తమ దేశంలోకి రావాలంటే ముఖ్యంగా తల్లితండ్రుల అనుమతి ఉండాల్సిందే అంటూ కండిషన్ పెట్టింది..ఈ మేరకి ధృవీకరణ పత్రాన్ని సమర్పించిన మైనర్లు మాత్రమే యూఏఈలోకి ప్రవేశం ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది..అయితే తల్లి తండ్రులతో ప్రయాణం చెయని సమయంలో మాత్రమే ఈ నిభందన వర్తిస్తుందని యూఏఈ ప్రభుత్వం తెలిపింది క్లారిటీ ఇచ్చింది..
ఇదే విషయాన్ని యూఏఈ జనరల్ డైరెక్టరేట్ అఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ ఆఫైర్స్-దుబాయ్ ఈ ప్రకటన విడుదల చేసిందని ఎయిరిండియా వెల్లడించింది...అయితే ఈ నిభందన జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు మైనర్ ఎవరైనా సరే ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న సముయంలో కూడా ఈ నిభందన వర్తిస్తుందని తెలిపింది..అయితే ఆ సమయంలో తల్లి తండ్రుల లేకపోతే వారిని చూసుకునే గార్దియన్స్ కూడా అంగీకార ప్రకారం లెటర్ ఇవ్వాలని తెలిపింది ఏది ఏమినా యూ