అమెరికాలో రోజు రోజు కి భారతీయుల మరణాలు స్వదేశంలో ఉంటున్న ఎన్నారైల తల్లి తండ్రులని ,భందువుల్ని ఆందోళనకి గురిచేస్తున్నాయి..ఈ మధ్యకాలంలో ముఖ్యంగా తెలుగువారి మరణాలు తెలుగు రాష్ట్రాల ప్రజలని భయభ్రాంతులకి గురిచేస్తున్నాయి ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఎన్నారైల భంధువులు తెగ టెన్షన్ పడుతునారు..అయితే తాజాగా జరిగిన సంఘన సారాంశం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది..

 Image result for nri swarna died road accident in chicago

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉడతా స్వర్ణ చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై దుర్మరణం చెందారు.. భర్త కిరణ్‌కుమార్‌, కుమార్తె బిందుతో కలిసి ప్రయాణిస్తున వీరి కారును మరో కారు వెనుకనుంచి ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న కుటుంభం గాయాలపాలయ్యైంది..అయితే స్వర్ణ కి తీవ్రమైన గాయాలు అవ్వడంతో ఆమె చికిత్ప పొందుతూ మృతి చెందినట్లు ఆమె కుటుంభ సభ్యులకి తెలిపారు..ఇదిలాఉంటే

 Image result for nri swarna died road accident in chicago

విజయవాడకు చెందిన ఓ వ్యాపారి కుమారుడు ఉడతా కిరణ్‌కుమార్‌తో పదేళ్ల క్రితం స్వర్ణకి వివాహమైంది. వారికి  ఓ కుమార్తె కూడా ఉంది.  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అయిన కిరణ్‌ ఏడాదిగా అమెరికాలో చికాగోలో ఉద్యోగం చేస్తున్నారు.  భార్య కుమార్తె నాలుగు నెలల క్రితమే అక్కడివెళ్లారు...ఇదిలాఉంటే ఆమె మృత్యువాత పడక ముందు అరగంట క్రితమే తన తమ్ముడుకి మిస్ యూ రా రాఖీ పండగకి నీదగ్గర లేను అంటూ మెసేజ్ కూడా చేశారట.. దాంతో కుటుంభ సభ్యులు ఈ విషయం చెప్తూ మరింత కన్నీరు మున్నీరు అవుతున్నారు...వారిని ఆపడం ఎవరి వల్లా కావడంలేదని అంటున్నారు భంధువులు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: