పొట్టకూటి కోసం పోరుగుదేశం
వెళ్ళిన ఉపాధి కార్మికుల జీవితాలు మంటల్లో కలిసిపోయాయి..కుటుంభాలని సైతం వదిలి
కడుపుకట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకుని కుటుంభాన్ని సాకుతున్న వారి జీవితాలు
బూడిద అయ్యిపోయాయి..సౌదీలో జరిగిన ఒక దుర్ఘటన నిజామాబాద్ లోని వారి
కుటుంబాలు తీవ్ర విషాదంలో కుమిలిపోతున్నాయి..వివరాలలోకి
వెళ్తే..
సౌదీ అరేబియాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు సజీవ దహనమయ్యారు...నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన బొంత దేవిదాస్, నిజామాబాద్ నగరానికి చెందిన సయ్యద్ సత్తార్లు సౌదీలోని ఓ కంపెనీలో పని నిమ్మిత్తం చేరారు..అయితే మధ్యాహ్నం భోజన సమయంలో కార్మికులు అందరూ గదిలో పడుకుని ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దాంతో..
అక్కడ ఉన్న వారు అందరూ అలెర్ట్ అయ్యారు అయితే వీరు ఇద్దరు ఉన్న ప్రాంతంలో రసాయనాలు ఉండటంతో అక్కడి నుంచీ తప్పించుకునే దారిలేక ఆ మంటల్లో చిక్కుకుని కాలి బూడిద అయిపోయారు..అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అయితే మరణించిన వారి గ్రామంలో కుటుంభాలలో తీవ్రమైన విషాదం నిండుకుంది.