అమెరికాలో భారత సంతతి మహిళకి అరుదైన గుర్తింపు లభించింది..అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్ష అవార్డు కి ప్రవాస భారతీయురాలికి దక్కింది...భారతీయులు ఎంతో మందికి అమెరికాలో ఎన్నో అవార్డులు వరించాయి కాని ఈ అవార్డ్ దక్కించుకున్న ఏకైక మహిళా భారతీయురాలు ఆమె ఒక్కరే కావడం విశేషం..ఇంతకీ ఎవరా భారత సంతతి వ్యక్తి అంటే..
అమెరికాలో మానవుల అక్రమ రవాణాని మానవుల అక్రమ రవాణాని అరికట్టడంలో ఎంతో ప్రతిభ కనబరిచిన భారత సంతతి మహిళా “మినల్ పటేల్ దవీస్” కి అమెరికా అధ్యక్షుడి పురస్కారం వరించింది. ఈ అక్రమ రవాణాను నిరోధించేందుకు హోస్టన్ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్కు ఆమె సలహాదారుగా పనిచేశారు. శ్వేత సౌధంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పాంపియో చేతుల మీదుగా ప్రెసిడెన్సీ పతకాన్ని ఆమె అందుకున్నారు.
అమెరికాలో నాలుగో పెద్ద నగరం హోస్టన్లో మానవుల అక్రమ రవాణా నిరోధించేందుకు ఆ నగర మేయర్కు సలహాదారుగా ఆమె 2015లో నియమితులయ్యారు...అప్పటి నుంచీ ఆమె ఈ అక్రమ రవాణాని నివారించడంలో ఎంతో కీలకమైన పాత్రని పోషించారు..అయితే ఒక భారతీయురాలికి ఈ గౌరవం దక్కడం ఎంతో సంతోషంగా ఉందని పరువులు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు.