అమెరికాలో ఉన్నత ఉద్యోగం ,ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న తన భార్య..ఇద్దరికీ ఎంతో ఇష్టమైన విహార యాత్రలు హాయిగా జీవితం సాగిపోతున్న సమయంలో వారి ఇద్దరి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఇద్దరు  భారతీయ ఎన్నారై దంపతులు ఒక నేషనల్ పార్క్ లో అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డారు..వివరాలలోకి వెళ్తే..

 Image result for holidays and happily ever afters

 భారతీయ యువ దంపతులు అయిన విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి (30) లు ఇద్దరూ కాలిఫోర్నియాలోని యొసెమైట్ నేషనల్ పార్క్ కి విహార యాత్రకి వెళ్ళారు సహజంగానే ఇద్దరికి ప్రకృతిలో తిరగడం అంటే ఎంతో ఇష్టం కావడంతో ఆ ప్రాంతానికి వెళ్ళారు..అక్కడ సుమారు 800 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో మృతి చెందారు. ఈ వివరాలని స్థానిక దినపత్రిక ఒక వార్తాకథనం ప్రచురించింది.

 Related image

సాన్‌జోస్ కేంద్రంగా పని చేస్తున్న సిస్కోలో సిస్టమ్స్ ఇంజినీర్‌గా విశ్వనాథ్ ఉద్యోగం పొందిన తర్వాత ఈ దంపతులు ఇటీవలే న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకు మారారు. వారు నిత్యం సాహసక్రీడల్లో పాల్గొంటూ హాలీడేస్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్స్ అనే బ్లాగ్‌లో వాటి విశేషాలు వెల్లడించే వారు. అయితే  గురువారం వారి ఇద్దరి మృతదేహాలని కొంతమంది పర్యాటకులు గమనించి పోలీసులకి తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఈ పార్క్ లో ఏడాదికి దాదాపు 10 మంది మృతి చెందినట్టుగా పార్క్ అధికారులు తెలిపారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: