తెలంగాణకు చెందిన  దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి హత్యకేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  ప్రీతి రెడ్డి మరణానికి ముందు ఏం జరిగి ఉంటుందన్న దానిపై వారికి అంతుచిక్కడం లేదు.  ఆమె అదృశ్యం అయిన రోజే మరణించి ఉంటుందా..లేదా అన్న విషయం పై దర్యాప్తు చేస్తున్నారు.  అయితే ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిన మాజీ  ప్రియుడు హర్ష్ నర్డే ప్రీతితో మాట్లాడేందుకు శనివారం  టామ్‌వర్త్ నుంచి  సిడ్నీ వచ్చాడు. వీరిద్దరూ కలిసి ఓ వైద్య సదస్సుకు హాజరయ్యారు.


ఆ తర్వాత ఓ హోటల్ వద్ద ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా తాను చూశానని వారి స్నేహితుడొకడు పోలీసులకు తెలిపాడు.  ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్డే కూడా ప్రాణాలు కోల్పోయాడు.  ప్రీతిరెడ్డి సిడ్నీలోని మెక్‌డొనాల్డ్స్ వద్ద ఒంటరిగా ఉన్న సీసీటీవీ  ఫుటేజీలు కనిపించాయి.


తనకు పరిచయస్తుడితో అదే హోటల్‌లో ఆమె బస చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు, అదే రోజు రాత్రి ప్రీతి స్నేహితుల్లో ఒకరికి నర్డే మెసేజ్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించారు. శనివారం సాయంత్రం ప్రీతితో మాట్లాడానని, ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని ఎస్సెమ్మెస్ చేశాడు.  ఈ కేసులో మరెవరినీ అనుమానితులుగా భావించడం లేదన్న పోలీసులు నర్డేకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: