అమెరికాలో ఎంతో మంది భారతీయ
వివిధ స్థాయిలలో ఉద్యోగాలు, కంపెనీలు నిర్వహించుకుంటూ ఉన్నత స్థానాలలో ఉంటూ
భారతీయులకి ఎంతో గర్వకారణంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతంది ఎన్నారైలు డబ్బుకి ఆశపడి మోసాలకి పాల్పడుతూ భాతీయుల
పరువుని బజారుకి ఈడ్చే నేరాలలో పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన వీసా మోసం కేసులో
ముగ్గురు తెలుగు ఎన్నారైలని దుపులోకి తీసుకున్నారు అమెరికా పోలీసులు. వివరాలలోకి
వెళ్తే..
అమెరికాలోని న్యూజెర్సీ , కాలిఫోర్నియా లోని రెండు వేరు వేరు ఐటీ కంపెనీలకి చెందిన విజయ్ మానె , వెంకట రమణ, ఫెర్నాండో సిల్వా, సతీష్ వేమూరి, అనే ముగ్గురు ప్రవాస భారతీయులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు న్యూజెర్సీ కేంద్రంగా, ప్రొఫెషనల్స్, క్లైంట్ ఏ, కాలిఫోర్నియా కేంద్రంగా క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఐటీ స్టాఫింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగం పొందాలనుకునే విదేశీయులకి హెచ్ -1 బీ వీసా ఇప్పించుతామని చెప్పి మోసం చేస్తున్నారు. దాంతో తగిన సమాచారం అందుకున్న పోలీసులు వారిని వలపన్ని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. అయితే వారు 2.5 లక్షల పూచీకత్తు తో బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే ఈ నేరం పై ఇప్పటికే ఎంతో మందిని అరెస్ట్ చేశారని, ఇలాంటి వాటిపై తీవ్ర చర్యలు ఉంటాయని అంటున్నారు అధికారులు.