రంగారెడ్డి జిల్లలో ఇందిరమ్మ బాట సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి నిజంగా ప్రాణం మీదికి వచ్చింది. ఇప్పటికే ఈ జిల్లలో 3-4 ఎంఎల్ఏ లు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం నేపథ్యంలో కిరణ్ కు సహజంగానే టెన్షన్ వుంది. దాంతో పాటుగా మంత్రులు ప్రసాద్,సబితా ఇంద్ర రెడ్డిల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు సమాచారం. అసలే మహబూబ్ నగర్ లో అరుణ, జూపల్లి మధ్య విభేదాలను సరిగ్గా పట్టించుకోక కాంగ్రెస్ నుండి జూపల్లి దూరమయ్యారు. తన ఇందిరమ్మ బాటలో భాగంగా వీరిద్దరిని ఒక వేదిక మీదకు తీసుకురావడానికి కిరణ్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. కిరణ్ స్వయంగా బుజ్జగించడం తోనే ప్రసాద్ హాజరయ్యాడు. ఇక మొహం చూపెట్టుకోలేని పరిస్థితి నుండి కిరణ్ త్రుటిలో బయటపడ్డాడు. ఎంత అధిష్టానం అండ ఉన్నా కిరణ్ రాజకీయ చతురతను ప్రదర్శించకపోతే రానున్నాయి మరిన్ని గడ్డు పరిస్థితులు ! 

మరింత సమాచారం తెలుసుకోండి: