ప్రపంచంలోనే తొలి సారిగా ప్రమాదవశాత్తూ అత్యాచారం జరిగిన ఘటన నమోదైంది. ఈ ఘటనలో నిందితుడైన కోటీశ్వరుడైన వాణిజ్యవేత్తను బ్రిటన్ కో్ర్టు నిర్దోషిగా వదిలిపెట్టడం గమనార్హం. తాగిన పరిస్థితిలో తన అంగం అనుకోకుండా ఒక యువతి యోనిలోకి చొరబడిందని ఆ వ్యక్తి చెప్పిన మాటలను కోర్టు విశ్వసించి నిర్దోషిగా ప్రకటించింది. తన అపార్ట్‌మెంటుకు ఫ్రెండ్‌తో కలిసి వచ్చిన యువతిని ఈషాన్ అబ్దుల్ అజీజ్‌ అత్యాచారం చేశాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. 


కాని తాను అత్యాచారానికి పాల్పడలేదు బాబో అని అబ్దుల్ కోర్టుకు మొరపెట్టుకున్నాడు. ఆ యువతి తనను ఆటపట్టిస్తుండగా తాగిన మైకంలో ఆమెపై పడిపోయానని, ఆ సమయంలోనే తన పురుషాంగం అనుకోకుండా ఆ అమ్మాయి యోనిలోకి ప్రవేశించిందని అతడు విన్నవించుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు టీనేజర్‌పై అత్యాచారం చేశాడని అతడిపై మోపిన ఆరోపణలను కొట్టివేసింది. బాధితురాలి వివరణను కోర్టు నమ్మలేదు. ఈ స్థితిలో నిందితుడు కేసునుంచి విముక్తి పొందాడు.


ఇక్కడ దిగ్ర్బాంతి కలిగించేది ఏమిటంటే ఆ అమ్మాయి యోనిలో కనిపించిన వీర్యం ఆ వ్యాపారి డీఎన్ఏని కలిగి ఉన్నట్లు వైద్యపరీక్షలు తేల్చాయి. ఆ అమ్మాయితో పాటు వచ్చిన 24 ఏళ్ల స్నేహితురాలతో అతడు సెక్సులో పాల్గొన్నప్పుడు ఆ వీర్యం బయటికి వచ్చిందని నిర్ధారణ అయింది. అదే సమయంలో బాధితురాలు తనను ఆట పట్టిస్తున్న సమయంలో తానామెపై పడిపోయానని, తను మత్తులో ఉండగానే అనూహ్యంగా ఆ ఘటన జరిగిపోయిందని నిందితుడు వాపోయాడు. 
ప్రపంచంలో తొలి యాక్సిడెంటర్ రేప్ అలా చోటు చేసుకుందన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: