తెలుగు ఇండస్ట్రీలో రోజా హీరోయిన్ పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆ మద్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజు సీఎం చంద్రబాబు, మరో మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను అమెను ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. అయితే ఈ బహిష్కరణపై కారాలు మిర్యాలు నూరుతూ రోజు చంద్రబాబు నాయుడిని మీడియా సాక్షింగా మరోసారి తిట్టడంపై టీడీపీ వర్గీయులు గరం గరంగా ఉన్నారు.

ఇప్పుడు రోజాపై నటుడు, దర్శకుడు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆగ్రహంగా ఉన్నారు. అంతే కాదు రోజాను హీరోయిన్ గా తీసుకు వచ్చి తను పెద్ద తప్పు చేశానని అంటున్నాడు. వివరాల్లోకి వెళితే.. ‘ప్రేమ తపస్సు’ చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ సరసన రోజాను ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత పలు సినిమాల్లో చాన్స్ ఇప్పించారు. అంతే కాదు అప్పట్లో తెలుగు దేశం పార్టీ తరుపున రోజాకు మంచి స్థానం కూడా కల్పించారు.

అయితే అప్పట్లో టీడీపీలో ఉన్నపుడు రోజా.. చంద్రబాబునాయుడిని గొప్పగా పొగిడిందని ఇప్పుడుపార్టీ మారి వైసీపీ ఎమ్మెల్యేగా పదవి రాగానే సీఎం చంద్రబాబునాయుడిని తిట్టి తిట్టు తిట్టకుండా తిడుతుందని వాపోయారు. రోజా ని సినిమాల్లోకి తీసుకొచ్చి హీరోయిన్ గా చాన్స్ ఇచ్చి తెలుగు సినీ రంగానికి పరిచయం చేయడమే కాకుండా రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్ద తప్పే చేసానని బాధపడుతున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: