తెలంగాణ లో మొన్నామద్య ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి..12 స్థానాలకు గాను పది స్థానాలు టీఆర్ఎస్ గెలుపొందగా రెండు స్థానాలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తాజాగా నిజామాబాదు స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ మద్య వెంకటరమణారెడ్డి పై కొన్ని ప్రచారాలు మొదలయ్యాయి..అధిష్టానానికి చెప్పకుండా బరిలోంచి తప్పుకున్నట్లు అయితే దీనిపై స్పష్టమైన వివరణ తాను తప్పుకోవడానికి గల కారణాలను సవివరంగా ప్రస్తావిస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సవివరంగా ఓ లేఖ రాసినట్లు తెలుస్తుంది.


నిజామాబాదు స్థానం నుంచి తాను ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే రూ.4 కోట్ల మేర డిపాజిట్ చేయాలని టీ కాంగ్ సీనియర్ నేతలు తనను డిమాండ్ చేశారని రెడ్డి తెలిపారు. దీంతో రూ.2 కోట్లను షబ్బీర్ అలీ సమక్షంలోనే నేతల వద్ద డిపాజిట్ చేశానని ఆయన తెలిపారు. అయితే మిగిలిన రూ.2 కోట్లు కూడా డిపాజిట్ చేయాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లోనే రాజీనామా చేశారనని ఆయన పేర్కొన్నారు.


నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులు


అంతే కాదు ఆ సమయంలో టీఆర్ఎస్ నేతలతో మాట్లాడకూడదని..వారి ప్రలోభాలకు లొంగరాదని చెప్పారు. వాస్తవాని తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి సింగిల్ పైసా కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. డబ్బుల కోసం తనను వేధించి, పోటీ నుంచి తప్పుకునేలా చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధినాయకత్వాన్ని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: