తెలుగులో ఓ కవి అన్నట్లు ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ..’ అని రోజు రోజుకీ మనిషి మానవత్వాన్ని పూర్తిగా మంటగలుపుతున్నాడు... బంధుత్వాలు అసలే మర్చిపోతున్నాడు. తాను సభ్య సమాజంలో ఉంటున్నా..తన కుటుంబం వరకే పరిమితమవుతూ మంచీ చెడూ అన్నీ మరిచిపోతున్నాడు. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరిలో సొంత అన్న కూతురుని కిడ్నాప్ చేసి ఆ పాప రెక్కలు విరిచి చేతులు కట్టేసి..ముఖానికి ప్లాస్టర్ చుట్టి నరకం చూపించాడు. బాబాయి అని నమ్మినందుకు చిన్నారికి నరకం చూపించాడు..పాపం పండింది..ఆ దుర్మార్గుడు దొరికాడు..ఇక వరంగల్ లో తనను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిని బతికి ఉండగానే గోనెసంచిలో కట్టేసి స్మశానంలో పాతిపెట్టి వచ్చాడు.

వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా భూపాల్ పల్లి ఎల్ బినగర్ లో మల్లమ్మ(85) కు ముగ్గురు కుమారులు,కూతురు ఉన్నారు. అయితే తండ్రి ఉద్యోగం మూడవ కుమారుడు శ్రీనివాస్ కి వచ్చింది..దీంతో తల్లిని పోషించాల్సిన బాధ్యతకూడా అతనికే వచ్చింది. అయితే గత కొంత వీరి మద్య కొన్ని మనస్పర్ధలు వచ్చి కొంత కాలం కూతురు వద్ద ఉంటూ వచ్చింది. తాజాగా శ్రీనివాస్ వద్దకు రాగా ఆమెకు ఆరోగ్యం దెబ్బతినడంతో ఆమెకు పరిచర్యలు చేయాల్సి వస్తుందని నీచమైన ఆలోచనతో తల్లిని బతికి ఉండగానే గోనె సంచిలో కట్టేసి స్మశానంలో పాతి పెట్టి వచ్చాడు శ్రీనివాస్ అతిన భార్య. 

తల్లి ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవాలని వచ్చి ఆమె కూతుళ్లు తల్లి కనిపించకపోవడంతో శ్రీనివాస్ ని నిలదీశారు..దీంతో చేసిన తప్పుఒప్పుకున్నాడు. సోదరుడు చేసిన నిర్వాకంతో కూతుళ్లు..సోదరులు కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: