ఎంత చదువుకున్నా.. ఎంతగా లోకం తెలిసినా నమ్మేవాళ్లుంత కాలం మోసాలు సాగుతూనే ఉంటాయని చెప్పడానికి మరో సాక్ష్యం దొరికింది. పూజ పేరుతో కోటీశ్వరుల ఇంట్లో అడుగు పెట్టిన ఓ బురిడీ బాబా తెలివిగా వారిని తప్పుదోవ పట్టించి కోటిన్నర రూపాయలు కాజేశాడు. ప్రసాదం అంటూ పరమాన్నంలో మత్తుమందు కలిపి సొమ్ముతో ఉడాయించారు.

హైదరాబాద్లో సంచలనం కలిగించిన ఈ ఘటన బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో జరిగింది.డిటైల్స్ లోకి వెళ్తే... బేగంపేటలో ప్రఖ్యాతిగాంచిన లైఫ్ స్టైల్  భవనం యజమాని మధుసూదన్ రెడ్డి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ మధ్య ఇంటికి మరమ్మత్తుల చేయించాడు. ఆ తర్వాత ప్రత్యేక పూజ చేయించాలనుకున్నాడు.

తెలిసిన వారి ద్వారా కర్ణాటకకు చెందిన శివ అనే స్వామీజీని పూజ కోసం మాట్లాడుకున్నాడు. దర్జాగా బంజారాహిల్స్్లోని ఓ ప్రైవేటు హోటల్ లో దిగిన స్వామీజీ బుధవారం ఉదయం బంజారా హిల్స్ లోని మధుసూదన్ రెడ్డి ఇంట్లో పూజ ప్రారంభించాడు. పూజలో మధుసూదన్ రెడ్డితో పాటు భార్య విద్యావతి, కుమారుడు సందేశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


వీరి ఐశ్వర్యం కన్నేసిన శివ స్వామీజీ.. పూజలో లక్ష్మీదేవిని ప్రతిష్టించాలని కోరాడు. ఇంట్లో ఉన్న నగదు తీసుకురావాలని చెప్పాడు. మధుసూదన్ కుటంబీకులు అమాయకంగా ఇంట్లో ఉన్న కోటి 30 లక్షల రూపాయలు పూజలో ఉంచారు.

అప్పటికే పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న స్వామీజీ ప్రసాదంలో మత్తుమందు కలిపి వారికి ఇచ్చాడు. అది తిని వారు మత్తులో ఉండగానే పూజ చేసిన సొమ్మును మరో ఆలయంలో పూజ చేయించాలని నమ్మబలికాడు. అక్కడి నుంచి వారిని హోటల్ కు తీసుకెళ్లి ధ్యానం చేసుకోమని చెప్పాడు. వారు ధ్యానంలో ఉండగానే సొమ్ముతో పరారయ్యాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: