నవ్యాంధ్రప్రదేశ్ నవనిర్మాత అద్భుత రాజకీయ వ్యూహకర్త దేశములోనే మహోన్నత చరిత్రాత్మక ముఖ్యమంత్రి ని కేంద్ర ప్రభుత్వములోని నీతి ఆయోగ్ (గత ప్రభుత్వాలలోని ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నూతన వ్యవస్థ)  ఒక విషయములో చివాట్లు పెట్టినట్లు వార్తలు గుప్పుమన్నాయి.అవునా, నిజమేనా? అని పాటలాగా ఆరా తీస్తే అవుననే నని కర్ణాకర్ణిగా తెలుస్తున్ది.   అనేక సంధర్భాలలో కేంద్రం నుంచి మొట్టికాయలు పడీ పడీ తల బొప్పి కడుతూ ఉంటే, మరోసారి ఈ విషయం చంద్రబాబుని కలవరపెడుతుంది.


 

కేంద్రం ఆంధ్రప్రదేశ్ లోని ఆర్ధికంగా బాగా వెనుకబడ్డ ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రాంతాలలో విద్య - ఆరోగ్యం - తాగునీరు మొదలైన అవసరాలను తీర్చి అభివృద్ది సాధించటానికై, వసతులు కల్పించటానికి ఖర్చుచేసేటందుకు 700 కోట్ల రూపాయలను కేటాయించి, విడుదల చేయగా- వాటిని ఆయా జిల్లా కలక్టర్లు వెరే అవసరాలకు వాడేశారు. వివరాలను సేకరించ ప్రయత్నించిన నీతీఅయోగ్ కి జిల్లాలనుండి, ఆయా కలక్టర్లనుండి వచ్చిన సమాదానం "చంద్రబాబు పర్యటనల సమయంలో ఖర్చులు, వేదికల నిర్మాణం, వేదికలపై కూలర్ల ఏర్పాట్లు, స్కానర్ల కోసం ఖర్చు పెట్టేశామని సమాదానం వచ్చింది"  కానీ, నీతి ఆయోగ్ కు పంపిన నివేదికలో మాత్రం 700 కోట్ల రూపాయలను వెనుక బడిన జిల్లాల్లోనే విధ్య, ఆరోగ్యం, తాగునీరు తదితరాల అభివృద్ధి కోసం ఖర్చు చేసినట్లుగా చూపించారట.


 

నీతి ఆయోగ్ ఒక రకమైన ఆడిట్ నిర్వహించి ఆ మోసాన్ని పసిగట్టి లెక్కలు చూసేసరికి అసలు తమాషా, గారడి వెలుగు చూసినట్లు వారు చీవాట్లు పెట్టినట్లు చెపుతున్నారు. బడ్జెట్ ప్రకారం, కేంద్ర ఆదేశాల ప్రకారం ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులలో ఎనిమిది కోట్లు మాత్రమే ఆ పేర్కొన్న అవసరాల కు ఖర్చు పెట్టి మిగిలిన సొమ్మును దారి మళ్లించడంపై ఆగ్రహం తో మండిపడినట్లు తెలుస్తుంది. అంతే కాదు 700 కోట్ల రూపాయలను ఎలా ఖర్చుచేశారో వివరిస్తూ అకౌంట్స్ అందచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకీదులు పంపుతూ - లెక్ఖల్లో తేడాలోస్తే తాము ఆడిట్ బృందాలను పరిశీలన కోసం పంపి స్వయంగా చర్య తీసుకుంటామని సీరియస్ గా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ లెఖ్ఖన విశ్వనగరి అమరావతి లెఖ్ఖలలో ఎన్ని మతలబులున్నాయో? కుంభకోణాలున్నా సాక్ష్యాలుండాలి గదా? బహుశా నీతి అయోగ్ లాంటి వ్యవస్థల దృష్ఠి తప్పనిసరిగా ఉంటుందనే జనం భావిస్తున్నారు. బాబు భవిష్యత్ ....జగన్ గతం (జైల్-జీవితం) లాగా ఉండకూడదనే అనుకుందాం! 


గతం లోని యు.పి.ఏ మరియు పాతకాలపు ఎన్.డి.ఏ ప్రభు త్నాల పద్దతిలో కాకుండా మోడీ గారి ప్రభుత్వం బడ్జెట్ అలాట్మెంటు లను నిర్దేశించిన అవసరాలకే ఉప యోగించాలనే సిద్ధాంతం మన  బాబుగారికి అర్ధమయి ఉండదు. గతం గతః అనుకొని ఇకనైనా కేంద్రతో సరిగ్గా వ్యవహరించక పోతే నీతి ఆయోగ్ చీల్చి చెండాడుతుందని సి.బి.ఎన్ గారికి అర్ధమయ్యే ఉంటుంది.  తప్పుడు లెక్కలు చూపితే ఆకస్మిక తనిఖీలు తప్పవని, హెచ్చరించిందట.



మరింత సమాచారం తెలుసుకోండి: