కొత్త జిల్లాల నుంచి ప్రాలన ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దసరా రోజున ఉదయం 11గంటల 13నిమిషాలకు కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరపాలని ముఖ్యంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆమేరకు నూతన జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటును ధృవీకరిస్తూ.. దసరా రోజునే.. కేసీఆర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. మొదట కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. తరువాత కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అవుతాయి.