ప్రపంచ దేశాలు అభివృద్ధి పంథాన పయనిస్తున్నా బానిస వ్యవస్థ మాత్రం దేశాలను పెట్టి పీడిస్తూ ఉంది. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత మనుషులను పట్టి పీడిస్తూనే ఉన్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఈ జాబితాలో పాకిస్థాన్ ముందుందని వరల్డ్ నివేదికలు చెబుతున్నాయి. పాక్లో ప్రతి ఏటా సుమారు 1000 మంది హిందూ, క్రిస్టియన్ వర్గాలకు చెందిన బాలికలు బానిసలుగా మారుతున్నారు. ముస్లిం షేక్ల వద్ద అప్పులు చేసి తీర్చలేని పేద కుటుంబాల ఆడ పిల్లలు బలవంతంగా వారి వశమవుతున్నారు.