తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్లో గురువారం ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టే సందర్భంగా జయలలిత నెచ్చెలి శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనై.. కంటతడి పెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాల్సిందిగా పార్టీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేయగా.. దానిని తమిళనాడు ప్రస్తుత సీఎం పన్నీరు సెల్వం శశికళకు అందజేశారు.