కాంగ్రేస్, టిడిపి చేస్థున్న కుట్రలకు కుమిలి పోతున్నామని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. జగన్ జైలు పాలయి ఏడాది పూర్తయిన సంధర్బంగా ఆందోలనా పథం పట్టిన విజయమ్మలో దు:ఖం కట్టలు తెచ్చుకుంది. ఉబికి వస్థున్న ధు:ఖాన్ని అదిమి పట్టి, కన్నీటిని కట్టలు వేసే ప్రయత్నం చేస్థూ విజయమ్మ అన్న మాటలు వారి దయనీయ స్థితికి అద్దం పట్టాయి.

తన భర్త వైఎస్సార్ చనిపోయినప్పటి నుంచి తాము ఎన్నో భాదలు పడుతున్నామని విజయమ్మ తెలిపారు. ఒకరి బాధను మరొకరితో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. జగన్ కు ఖచ్చితంగా బెయిల్ వస్థుందని ఆశాభావం వ్యక్తంచేసింది విజయమ్మ. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్థామన్న ధీమా వ్యక్తం చేసారు.

advertisements - Call 040 4260 1008

జగన్ గూర్చి ఏమి తెలుసని అభం శుభం తెలియని బాబును పట్టుకుని ఆర్థిక తీవ్రవాది అంటూ పెద్దపెద్ద మాటలంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. వైఎస్ సిఎం గా ఉన్నప్పుడు జగన్ మంత్రులకు కాదుకదా ఎవరికి కూడా ఫోన్ చేయలేదన్నారు విజయమ్మ. ఆమె మాటలు, ఆమె ముఖంలో కన్పించిన హావాభావాలు ప్రజల్లో మరింత సానుభూతిని తెచ్చే విధంగా ఉన్నాయని, ఇది వైఎస్సార్ సిపి కి మేలు చేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: