తెలంగాణ టీ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.  గత సంవత్సరం ఓటుకు నోటు వ్యవహారింలో అడ్డంగా బుక్ అయిన రేవంత్ చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ జరుగుతుంది..కాగా టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యపై వేటు పడింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన సమయంలో వీరిద్దరూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నందుకు రేవంత్, సండ్రను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. కాగా నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుతున్న సందర్భంగా వీరువురు అసెంబ్లీ ప్రాంగణంలో ఎర్రటి ఎండలో నిలబడి నిరసన తెలిపారు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి తమను సస్పెండ్ చేయడానికి నిరసనగా.. వీరు ఎండలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: