తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాన్ అంటే ఎంతగా అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. తాజాగా పవన్ పై అభిమానంతో పెళ్లైన కొత్త జంట చేసిన వింత పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే ఈ సంఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదండోయ్..కర్ణాటక రాష్ట్రంలో..అవును కర్ణాటకకు చెందిన జంటకు పవన్కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టం..కాదు మహా పిచ్చి. సాధారణంగా పెళ్లైన కొత్త జంటకు పూజారి అరుంధతీ నక్షత్రం చూపించడం సాప్రదాయం. కాగా ఆ ప్రక్రియ మొదలు కాగానా ఒక్కసారే ఈ జంట అరుంధతీ నక్షత్రం కాదు మాకు పవన్ కళ్యాన్ దర్శనం కావాలని అన్నారట.
దీంతో ఖంగు తిన్న పూజారీ..పెళ్లికి వచ్చిన పెద్దలు ఆశ్చర్యపోయారట. వధూవరుల కోరిక ప్రకారం పవన్ కళ్యాన్ రప్పించడం కష్టం కదా..దీంతో మ్యారేజ్కి బయట పవన్ ఫోటోతో పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కొత్త దంపతుల కోరికని తీర్చారు. ఇక తమకు అరుంధతి నక్షత్రం కంటే ఇష్టమైన హీరో పవన్ కళ్యాన్ని దర్శించుకున్న తర్వాత ఎక్కడలేని సంతోషం వ్యక్తం చేశారాట వధూవరులు. వీరి అభిమానం హద్దులు దాటడంతో..పెళ్లికి దీవించడానికి వచ్చిన పెద్దలు నవ్వాలో..ఏడ్వాలో అర్ధకం కాక దీవించి వెళ్లారట.