నోట్లకట్టలు చూసి భారతప్రభుత్వమే నోరు వెల్లబెట్టింది, వాటిని మీడియాలో చూసిన భారతప్రజల కళ్లు చెదిరిపోయాయి. ట్రక్కుల నిండా వెయ్యి, 500 రూపాయల కట్టలే, కళ్లు జిగేల్ మనిపించే బంగారమే. బంగారం మాట దేవుడెరుగు నోట్లకట్టల లెక్క తేల్చేందుకే అధికారులకు చెమటలు పడుతున్నాయి.

నాలుగు ట్రక్కులు, 150 బ్యాగులు, వాటి నిండా నోట్లు, క్షణాల్లో లెక్కతేల్చే మనీకౌంటింగ్ మిషన్లు ఇక పనిచేయలేమంటూ మొండికేసే స్థితికి వస్థున్నా పూర్థికాని లెక్కింపు, ఓ రోజు పూర్థయినా కూడా లెక్కతేలలేదు, రేపటి వరకైనా పూర్థిగా లెక్కిస్థారో లేదో చెప్పలేని పరిస్థితి. సూపర్ స్టార్ రజకీకాంత్ అరుణాచలమే కళ్లుతిరిగి కిందపడే విధంగా ఉంది పరిస్థితి. ఆసినిమాలో గదినిండా డబ్బును చూసే వామ్మో అంటూ కళ్లింతవి చేసుకుని చూసిన వారికి ఇప్పుడు నిజజీవితంలో దొరికిన ఈ డబ్బును చూసి నోట మాట కూడా రావడం లేదు.

మొదట 200కోట్లు ఉంటాయన్నారు, ఆతర్వాత ఏకంగా 2500కోట్లు వరకు ఉండొచ్చు అన్నారు, ఆ మరుక్షణమే ఇప్పుడే చెప్పలేం రెండురోజులాగితే కాని తెలియదు అన్నారు. డబ్బు పరిస్థితే ఇలా ఉంటే దొరికిన బంగారం విలువ ఇంకెంత ఉంటుందో. అయితే ఇది భారత ప్రభుత్వాన్ని ఇప్పుడు వణికిస్థోంది. ఇది దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకోసం వచ్చిందా అన్న అనుమానాలే దీనికి కారణం. వీటి వెంట ఉన్న 40 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్థున్నారు.

ఈ డబ్బు గుజరాత్ లోని సూరత్ నుండి ముంబాయికి వస్థోంది, ముందస్థు సమాచారం అందుకున్న ఎన్ఐఎ, ఐటి బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని దాడి చేసి పట్టుకున్నారు. దేశ చరిత్రలో ఇంత బ్లాక్ మనీ పట్టుబడడం ఇదే మొదటి సారి. సాధారణంగా హవాలా సొమ్ము ఇలా వస్థుంది, కాని ఇంత ఉండదని అధికారులు అంటున్నారు. విచారణ పూర్థయితే కాని అసలు విషయం తెలియదు. కాని ఈ సంఘటన ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేయగా, దేశ ప్రజలను ఆందోలనకు గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: