ఈ మద్య కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు..ఏదో వెరైటీ కోసం తాపత్రపడే వారు కొన్నిసారు తాము ఏం చేస్తున్నామన్న విషయం మరిచిపోయి నెటిజన్లచే తిట్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత తమ పాపులారిటీ కోసం ఏం చేయడానికైనా వెనుకా ముందు ఆలోచించడం లేదు. తాజాగా అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ చేసిన ఓ పని ఇండియన్స్ కి ఆగ్రహం కలిగించింది.
భారతీయులు ఎంతో పవిత్రంగా కొలిచే కాళీ మాత ఫోటోను ఆమె తన ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేసి దానికింద కరెంట్ మూడ్ అని పేర్కొంది. ఈ పోస్ట్ చేసి 11 గంటలు కావొస్తుంది..కాగా దానికి సుమారు రెండు లక్షల లైక్స్ వచ్చాయి. ఈ ఫోటో చూసి ఆమె పెట్టిన క్యాప్షన్ చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు విపీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.