తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కి రజినీ కుటుంబం నుంచి పెద్ద వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే..గత కొంత కాలంగా తమిళనాడు లో రాజకీయాల్లో ఎన్నో సంచలన మార్పులు, విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు సర్ధుకోవాలంటే తమకు మంచి నాయకుడు అవసరం అని ప్రజలు భావిస్తున్నారు.
ఇక ఇదే మంచి సమయం అని రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ప్రజల అభీష్టం మేరకు ఫ్యాన్స్ ని సంతోష పెట్టడానికి రీసెంట్ గా రజినీ ఫ్యాన్స్ మీటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి రావడం నాకూ ఇష్టమే అని అన్నారు. దీంతో ఆయనపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు విమర్శలు గుప్పించడమే కాకుండా స్థానికత గురించి ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు రజినీ రాజకీయ ఎంట్రీ ప్రశ్నార్థకమైంది.
తాజాగా అభిమానులకు రజనీ ఫ్యామిలీ హెచ్చరికలు జారీచేసింది. రజినీకా అభిమానులే పెద్ద బలం అలాంటి అభిమాన సంఘానికి సంబంధించిన నియమాలను ధిక్కరించినా, వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా సంఘం నుంచి తొలగించబడతారంటూ వార్నింగ్ ఇచ్చింది. రజినీ అభిమాన సంఘం నేత సుధాకర్కు తెలియకుండా ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని తెలిపింది.
అంతే కాదు ఒకవేళ సంఘాల నుంచి తొలగించాలంటే తప్పకుండా సుధాకర్ ని సంప్రదించాల్సిందే..వాటిపై సర్వ హక్కులు ఆయనకు ఇవ్వబడుతున్నట్టు వెల్లడించింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో రజనీ ఫ్యామిలీ ఫ్యాన్స్ కు ఇలాంటి వార్నింగ్ జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.