గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం, వైసీపీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  ఏమాత్రం చాన్స్ దొరికినా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నంలో ప్రతిపక్షం ఉంటే..అభివృద్ది, సంక్షేప పథకాలకు పదే పదే అడ్డు పడుతున్నారని అధికార పక్షం ఆరోపిస్తుంది.  ఏది ఏమైనా గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for acham naidu
కులం పేరుతో ఎవరైనా రాజకీయాలు చేస్తే వారిని చెప్పుతో కొట్టండి అని పిలుపునిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు మనిషి మాత్రం ఎత్తుగా పెరిగారు కానీ, ఆయనకు బుర్ర ఉందో  అని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ నేత రోజా.  చిత్తూరు జిల్లా నగరిలో ఆమె మాట్లాడుతూ, కులం పేరుతో రాజకీయాలు చేసింది ఎవరు? అని అడిగారు.  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎన్నికల మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని రకాల వాగ్ధానాలు చేశారని కానీ అవి ఒక్కటీ నెరవేరడం లేదని దీన్ని బట్టి ప్రజలను ఆయన ఎంత మోసం చేస్తున్నారో కళ్లకు  కట్టినట్టు కనిపిస్తుందని అన్నారు.  
Image result for chandrababu
అందే కాదు కాపులకు రిజర్వేషన్ ఇస్తామని కుల రాజకీయం చేసిందెవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.  ప్రతిపక్ష హోదాలో ఉన్న తాము మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీను నెరవేర్చమంటే ఆగ్రహావేశాలు పొడుచుకొచ్చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.  అంతేకాదు కాపు కార్పోరేషన్ ఎర్పాటు చేసి, కుల రాజకీయం చేసిందెవరని ఆమె నిలదీశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: