దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా శనివారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయం జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి తదితరులు రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద అంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు.
వైఎస్ సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు.
‘వైఎస్ఆర్ బతికే ఉన్నారు. ఎందుకంటే, ఎందరో జీవితాలను ఆయన మెరుగుపరిచారు... వైఎస్ ఆర్ బతికే ఉన్నారు..ఎందుకంటే, మన హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి’ అని పేర్కొన్నారు.
YSR lives because he made lives better. He lives because his vision is relevant to the world. He lives because he lives in our hearts.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2017
Wishing you & your family, peace, health, happiness and prosperity. Eid Mubarak
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2017