భారత దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులు ఇలా ప్రతిరోజూ వార్తలు చుదువుతూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా ఇలాంటి దుర్మార్గుల్లో మార్పులు రావడం లేదు. దేశంలో నేర చరిత్ర పెరగడానికి ముఖ్యంగా టీనేజ్ వయసు నుంచి ఓల్డేజ్ వయసు వరకు ఫోర్న్ చిత్రాలు చూడటం వల్లే ఇలాంటి దారుణ సంఘటనలు జరుగుతున్నాయిన కొంత మంది నిపుణులు అంటున్నారు.
ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్..ఇంటర్ నెట్ అందుబాటులో ఉండటంతో మంచి కోసం వాడాల్సింది పోయి..దారుణాలకు వాడుతున్నారని అంటున్నారు. తాజాగా ఓ దుర్మార్గుడు భర్త అనే పదానికి తీరని మచ్చ తీసుకు వచ్చాడు. కట్టుకున్న భార్య నగ్న ఫోటోలను, వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడిన శాడిస్ట్ భర్త సునీల్ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన సునీల్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు.
కొంత కాలం క్రితం ఇతనికి వివాహం జరిగింది..కొత్తలో భార్యాభర్తలు అన్యోనంగా ఉన్నారు. ఆపై గొడవలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో ఓ భూ వివాదం నేపథ్యంలోను భార్యతో సునీల్ గొడవపడ్డాడు. అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. సునీల్ వదిలి పుట్టింటికి చేరుకున్న అతడి భార్యపై కక్ష పెంచుకున్నాడు.. భార్య నగ్న ఫోటోలను, వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు.
ఇతని దారుణం ఎంతగా మారిందంటే..నకిలీ మెయిల్ ఐడీతో భార్య నగ్న ఫొటోలను, వీడియోలను ఆమె సోదరుడికి పంపాడు. దీంతో షాక్ తిన్న బాధితురాలి సోదరుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్ కోసం గాలించారు.సైబర్ క్రైం పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం మియాపూర్ కూకట్పల్లి కోర్టులో సునీల్ను హాజరుపరిచారు.