ఈ మద్య మద్యం మత్తులో ఎంతో మంది యువకులు రోడ్లపై, రెస్టారెంట్లలో చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు బాగానే ఉన్నా..మద్యం నశాలానికి ఎక్కితే..వీరు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి.  అయితే ఈ మద్య కొంత మంది అమ్మాయిలు, ఆంటీలు మద్యం మత్తులు చేస్తున్న హల్ చల్ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. 

తాజాగా ఓ యువతి మెగాస్టార్ అభిమానినంటూ తాగిన మత్తులో రైల్లో హంగామా సృష్టించింది.  వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్‌రాథ్ రైలు స్లీపర్ క్లాస్‌లో యువతి ఫుల్ గా మద్యం సేవించి..అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్‌గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది.  ఇక్కడంతా వెదవలు ఉన్నారని... ‘‘మెగాస్టార్ అంటే ఈకట...ఆడికి చెప్పానంటే దూలతీర్చేస్తాడు.

మత్తులో మాట్లాడుతూ.. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది పెట్టింది.  మరో ప్రయాణికురాలు తనను నిద్రపొమ్మని అడిగింది..దానికి నువ్ పడుకో..లైట్ ఆర్పేయ్..చదువుందీ గొప్పా అనుకోవద్దు..చదువులో చూపించు..చిరంజీవి సినిమాలు చూశారో..అంటే నేను అసలు సినిమలే చూడనండీ అని ఆ యువతి అంది..చిరంజీవి సినిమా చూశారో...అని చిటికవేస్తూ... చూడొద్దని మరో యువతికి వార్నింగ్ ఇచ్చింది. రైల్లో తోటి ప్రయాణీకుడు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: