భారత దేశంలో గత కొన్ని రోజులుగా దొంగ బాబాల గుట్టు రట్టు అవుతున్నాయి.  భక్తి అనే ముసుగులో అమాయకులను నిలువునా దోపిడి చేస్తూ బయటికి మాత్రం పరమ భక్తులుగా నటిస్తున్న కొంత మంది దొంగ స్వామీజీలు వారి రాసలీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.  ఈ మద్య గుర్మిత్ రామ్ రహీం అలియాస్ డేరా బాబా ఇద్దరు సాద్వీలపై అత్యాచారం కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అరెస్ట్ అనంతరం ఆయన రాజబోగం..ఆయన ఆశ్రమంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

ఇలా పలువురు బాబాలు మహిళలపై అకృత్యాలు చేస్తూ పైకి మాత్రం స్వామీజీలుగా గౌరవం అందుకుంటున్నారు.  తాజాగా కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది. యలహంకలోని మద్దేవనపురంలో  మఠాధిపతి నంజీశ్వర్ స్వామీజీ.. మఠంలోని గదిలో ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్క అయ్యాడు.

ఈ తతంగం అంతా ఓ రహస్య కెమెరా ద్వారా స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన కర్ణాటకలోని స్థానిక టీవీ ఛానెళ్లలో స్వామి వారి రాసలీలల దృశ్యాలను ప్రసారం చేస్తున్నట్టు సమాచారం.  సుమారు ఐదొందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం కింద 220 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు. 

ఎంతో కాలంగా ఆద్యాత్మికంగా ఉంటున్న మఠంలో స్వామీజీ వ్యవహారంపై భక్తులు మండిపడుతున్నారు. పర్వతరాజ్ శివాచార్య స్వామి కుమారుడు నంజీశ్వర్ స్వామిజీ అలియాస్ దయానంద్. గతంలో  దయానంద్ జులాయిగా తిరుగుతూ..ఎన్నో నేరాలకు పాల్పడినట్లు సమాచారం. అవన్నీ పక్కన బెట్టి తన తండ్రి ద్వారా 2011లో ఈ మఠానికి పీఠాధిపతి కావాలని విఫలయత్నం చేశాడు.

తన పేరును నంజీశ్వర్ స్వామీజీగా మార్చుకుని క్రమంగా మఠాధిపతి అయ్యాడు. ఈ మఠానికి సంబంధించిన భూములను దుర్వినియోగం చేయడం, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆయనకు కొత్తేమీ కాదని ఆయన బాధితులు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: