తెలంగాణ పోరాటంలో ఎంతో మంది కళాకారులు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపారు.  తెలంగాణ ధూం ధాం అంటూ పల్లె పల్లెనా..వీది వీధిలో తమ ఆట పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు.  ఇందులో సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు సైతం డ్యాన్సులుచేసి ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు.  నిరసనలు తెలిపి తెలంగాణ పోరాటాన్ని కొనసాగించారు. 
Image result for telangana deputy speaker padma
ఇక అందరూ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ధూం ధాం  కొనసాగుతూనే ఉంది.  తాజాగా  తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ధూంధాం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఆటపాటలతో అదరగొట్టారు.
Image result for telangana deputy speaker padma dance
కార్యకర్తలతో పాటు స్టెప్పులేసి వారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారు. డాన్స్ చేయటానికి ఇబ్బంది పడ్డ కార్యకర్తలను డాన్స్‌లో పాల్గొనాలని సైగ చేశారు. అధికార, విపక్షల మధ్య తిట్లు, ఎగతెగని చర్చలతో విసుగెత్తిన పోయిన ఆమె  ఈ డ్యాన్స్ తో కాస్త సేదతీరినట్లు కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: