హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క‌ల‌ల బండి మెట్రోరైల్ ప్రారంభమైంది.  మియాపూర్ నుంచి కూకట్‌పల్లి వరకు అందులో ప్రయాణించారు.  అంతకుముందు ఆయన మియాపూర్‌లో మెట్రో పైలాన్‌ను ఆవిష్కరించారు.  అనంతరం మెట్రోను ప్రారంభించి కూకట్ పల్లి వరకు అందులో ప్రయాణించారు. మియాపూర్‌కు చేరుకున్న ఆయన్ను తొలుత మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.   

మియాపూర్ స్టేషన్‌కు చేరుకున్న ఆయన.. రిబ్బన్ కట్ చేసి మెట్రో స్టేషన్, రైలును ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోట్రోపై రూపొందించిన బ్రోచ‌ర్‌, దృశ్య‌మాలిక‌ను విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో క‌లిసి దృశ్య‌మాలిక‌ను వీక్షించారు. మెట్రో తొలి టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రధాని మోదీ.. మెట్రో రైలెక్కారు.

మెట్రో రైలులో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులు, అధికారులతో కలిసి కూకట్‌పల్లి వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో ఆయన మెట్రోకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.   ఈ కార్యక్రమాల తర్వాత ఆయన  హెచ్ఐసీసీకి బ‌య‌లుదేరుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: