మనదేశం చుట్టూ డ్రాగన్ చైనా కాలసర్పంలాగా కమ్ముకుంటూ వస్తున్న తరుణం మిది. ముఖ్యంగా మన ఇరుగుపొరుగు దేశా లకు ఆర్ధిక, రక్షణ అవసరాలను తీరుస్తూ ఆయా దేశాల్లో ప్రస్తుతమున్న రాజకీయ ఆధిపత్యాలను బలహీనపరుస్తూ క్రమంగా రాజకీయ నేపధ్యాన్ని తాను కోరుకున్నట్లుగా శాసించే దశకు పరిస్థితులను మార్చ గలుగుతుంది డ్రాగన్ చైనా.


చైనా దగ్గర అప్పుచేసిన, రక్షణపరమైన సహాయం పొందిన,  ఏదేశమైనా దాని కభందహస్తాల్లో చిక్కుకొని 'చైనా వలస రాజ్యం' గా మారటం సహజమని అనేక సార్లు ఋజువైంది. ఎందులో నైనా చైనా అనుసరించేది "చిలక్కొట్టుడే...అంటే సలామీ స్లైస్" విధానమే...అనుమానం లేదు. అయితే బలమైన పొరుగుదేశంగా ఉన్న ప్రజా స్వామ్య భారతావనికి ఇది సమస్యగా మారుతూనే ఉంటూ వస్తుంది. ఒక చోట చిక్కు ముడి విప్పితే మరో చోట చైనా మరో చిక్కు సమస్య సృష్టిస్తుంది దానికి మరో ముడి వేస్తుంది.  

nepal china relations కోసం చిత్ర ఫలితం

ఈ మద్య నేపాల్ పార్లమెంట్ ఎన్నికలలో వామపక్షాల కూటమి విజయం సాధించడం మరో భారత వ్యతిరేక పరిణామం. ఇరవై రెండేళ్ల క్రితం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. "నేపాల్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ - సిపిఎన్, యుఎమ్‌ఎల్ - పార్టీ" వారు ప్రజా స్వామ్య రాజ్యాంగ విధానాన్ని సమర్థించారు. ఈ చీలిక తరువాత ఏర్పడిన రెండవ పార్టీ - "నేపాల్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ-దశాబ్దిపాటు భయంకర భీకర బీభత్సకాండను సృష్టించింది.


ఆ రక్తపాతానికి మూడు వేలమంది బలైపోవడం ఆదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. అయితే ఈ చీలిక నేపద్యమంతా చైనా వ్యూహ-ప్రేరణ తోనే జరిగింది. నేపాల్‌లో "బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ" ఏర్పడకుండా నిరోధించడం దాన్ని భారత్ అను కూల దేశంగా మారకుండా నిరోధించటం చైనా లక్ష్యం. ఎందుకంటె “బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ” వల్ల నేపాల్ అనాదిగా భారత్‌ తో కొనసాగిస్తున్న సాంస్కృతిక, వ్యూహాత్మక స్నేహ సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయి. భారత్ నేపాల్ దేశాల భద్రత ఒక దానితో మరొకటి ముడి పడి ఉంది. ఈ దేశాల ఉమ్మడి భద్రతకు చైనా దురాక్రమణలవల్ల నిరంతరం ఏదో ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది.


నేపాల్‌లో‘ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి చైనా కుట్ర కుతంత్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ కుతంత్రంలో భాగంగానే ‘నేపాల్ మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ - సిఎఎన్, మావోయిస్ట్ - పదేళ్లపాటు సాయుధ సమరం పేరుతో రక్తం పెల్లుభికే బీభత్సకాండ సాగించింది. కానీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం దక్కడం అసంభవమని భావించిన 'చైనా ప్రచ్ఛన్న దళం - మావోయిస్ట్ పార్టీ' పన్నెండేళ్ళ క్రితం సాయుధ మార్గాన్ని వదిలిపెట్టింది, ప్రజాస్వామ్య రాజ్యాంగప్రక్రియలో భాగస్వాములు అవుతున్నట్లు‘మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ"అధినేత పుష్పకమల్ దహాల్ ప్రచండ ప్రకటించాడు.


nepal china relations కోసం చిత్ర ఫలితం

కానీ ఆ తరువాత రెండుసార్లు జరిగిన నేపాల్ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’ వారు ‘మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’ వారు విడివిడిగా పోటీ చేశారు. మూడవ ప్రధాన జాతీయ రాజకీయ పక్షం నేపాలీ కాంగ్రెస్, తొమ్మిదేళ్ల క్రితం జరిగిన మొదటి ‘రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాని, నాలుగేళ్ల క్రితం జరిగిన రెండవ రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో కాని ఏ ‘పార్టీ’కి మెజారిటీ రాలేదు. దీనికి ఏకైక కారణం ఈ ముక్కోణపు పోటీ. ఆ ఎన్నికల తరువాత మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ కొన్ని రోజులు ‘నేపాలీ కాంగ్రెస్’తోను మరికొన్ని సార్లు మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్టు పార్టీతోను జట్టు కట్టింది.


మొదటిసారి తొమ్మిదేళ్ల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికలలో అగ్రగామిగా నిలిచిన మావోయిస్ట్ పార్టీ, నాలుగేళ్లక్రితం నాటి ఎన్నిక లలో ఘోర పరాజయం పాలై, మూడవ స్థానానికి దిగజారింది. నేపాలీ కాంగ్రెస్ ఆ ఎన్నికలలో మొదటి స్థానం సాధించింది. నూతన రాజ్యాంగం ఏర్పడిన తరువాత ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ‘ఉభయ కమ్యూనిస్టు పార్టీ’లు కలసికట్టుగా పోటీ చేశాయి. ఈ కూటమికి ఘన విజయం లభించడానికి ఇదీ కారణం.

సంబంధిత చిత్రం

గత ఎన్నికల - రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు -లో మొదటి స్థానంలో నిలిచిన నేపాలీ కాంగ్రెస్ ఇప్పుడు ఘోర పరాజయం పాలు కావడానికి ఈ ‘కమ్యూనిస్టు పార్టీల’ ఏకత ఏకైక కారణం. ఇరవై రెండేళ్ల క్రితం చీలిన కమ్యూనిస్ట్ పార్టీలోని ఇరువర్గాలు -మార్క్సిస్ట్ లెనినిస్ట్‌లు, మావోయిస్టులు - ఇప్పుడు మళ్లీ ‘ఐక్య కూటమి’ కావడం చైనా వ్యూహంలో భాగం.. ఈ ఎన్నికలలో ‘మార్క్సిస్ట్ లెనినిస్ట్’ పార్టీతో జట్టు కట్టడం ద్వారా ‘మావోయిస్ట్’ పార్టీ తన ఉనికిని మాత్రం కాపాడుకోగలిగింది. ఈ కూటమి గెలిచినప్పటికీ అత్యధిక స్థానాలు ‘మార్క్సిస్టు లెనినిస్టు’ పార్టీకి దక్కడం ఇందుకు నిదర్శనం.


మావోయిస్టు అధినేత పుష్పకమల్ దహాల్ ప్రచండ మరోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ అధినేత కృష్ణప్రసాద్ శర్మ ఓలీ మరోసారి ప్రధానమంత్రి అవుతున్నాడు. అయినప్పటికీ చైనా అంతెవాసులైన  ప్రచండ బృందం వారు తమ ‘భారత  వ్యతి రేక కార్యక్రమం” ప్రారంభించనున్నారు. రానున్నరోజులలో భారత వ్యతిరేఖత కొనసాగించే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఓలీ ప్రభుత్వం మనుగడ మావోయిస్టు పార్టీ సమర్ధన కొనసాగడంపై ఆధారపడి ఉంది.


తొమ్మిదేళ్ల క్రితం మావోయిస్టు నేత ప్రచండ మొదటిసారి నేపాల్ ప్రధానమంత్రి అయ్యాడు. పద కొండు నెలల ‘పాలన’లో ఆయన ప్రభుత్వం అనేక భారత వ్యతిరేక కలాపాలను సాగించింది! బోధనలోను, పాలనలోను హిందీ ప్రాధాన్యం తగ్గించారు. పశుపతినాథ దేవాలయంలో రెండువేల ఏళ్లకు పైగా కర్నాటక ప్రాంతానికి చెందినవారు అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ సంప్రదాయా న్ని రద్దు చేయడానికి అప్పటి ప్రచండ ప్రభుత్వం విఫలయత్నం చేసింది.

nepal china relations కోసం చిత్ర ఫలితం


క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దినాటి సమ్రాట్ విక్రముడు అఖండ భారత దేశాన్ని పాలించాడు. విక్రముని సామ్రాజ్య రాజ్యాంగ వ్యవస్థలోని యాబయి ఆరు భారత రాజ్యాలలో నేపాల్ ఒకటి! ‘శకుల’ దురాక్రమణను తిప్పికొట్టిన సమ్రాట్ విక్రముడు తన విజయచిహ్నంగా నూతన ‘కాలగణన పద్ధతిని ఆరంభించాడు. అది ‘సంవత్- విక్రమ శకం . ఈ ‘సంవత్ శకాన్ని చంద్రగుప్త విక్రమాదిత్యుడు నేపాల్‌ లోనే లాంఛనంగా ఆరంభించడం చరిత్ర,  అప్పటి నుంచి రెండువేల సంవత్సరాల కుపైగా ‘విక్రమ సంవత్’ నేపాల్‌లో ఆధికారిక కాలగణన పద్ధతి.


ఈ ఆధికారిక విక్రమ సంవత్‌ను ప్రచండ ప్రభుత్వం రద్దు చేసింది. బ్రిటన్ దురాక్రమణదారుల వలస  పాలన స్థిరపడే వరకు అఖండ భారత్‌ లో నేపాల్ కూడా ఒక భాగమే.  అనాదిగా నేపాల్ భద్రతతో భారత భద్రత, భారత ప్రగతి తో నేపాల్ ప్రగతి ముడివడి ఉన్నాయి. క్రీస్తు శకం పంతొమ్మిదవ శతాబ్ది నుంచి, బ్రిటన్ పాలిత భారత్‌ లో చేరని, నేపాల్ స్వతంత్ర దేశమైంది.


nepal china relations కోసం చిత్ర ఫలితం


ఇరవై శతాబ్ది ఆరంభంలో బ్రిటన్ కూడ నేపాల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. మనదేశం బ్రిటన్ స్వాతంత్రం పొందాక మనదేశం నేపాల్ స్వతంత్ర దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ ఉభయ దేశాల సాంస్కృతిక జాతీయత ఒక్కటే. 

1949లో ఉభయ దేశాల మధ్య కుదిరిన  వాణిజ్యం, రాకపోకల ఒప్పందం, 1950లో కుదిరిన స్నేహం, శాంతి  అంగీకారం తర తరాల సాంస్కృతిక జాతీయ సమానత్వానికి ప్రతీకలు. ఈ ఒప్పందాలను రద్దు చేయాలని ప్రచండ బృందం వారు ఇరవై ఏళ్లుగా కోరుతున్నారు.

nepal china relations కోసం చిత్ర ఫలితం 

నేపాల్ సైనిక దళాలను చైనాకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్న వ్యూహం బెడిసికొట్టడంలో పద కొండు నెలలు గడవకముందే ప్రచండ ప్రధానిగా పదవీచ్యుతుడయ్యాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన పరిషత్ ఎన్నికలలో ఘోరంగా ఓడినప్పటికి ప్రచండ గతఏడాది ఆగస్టులో మళ్లీప్రధానిఅయ్యాడు  ఆలా జరగటం  చైనా  ప్రతిష్టించిన మావోయిస్టుల బెదరింపు రాజకీయాలలో భాగం.

అయినప్పటికీ ఈ సంవత్సరం జూన్‌ లో ప్రచండ మళ్లీ పదవిని పరిత్యజించవలసి వచ్చింది. ఇప్పుడు ప్రచండ మద్దతు నూతన ప్రధాని ఓలీకి ఎంతకాలం ఉంటుందో తెలియదు.  ఎందు కంటె గత ఏడాది ఓలీ ప్రధానమంత్రి పదవిని కోల్పోవడానికి కారణం మావోయిస్టులు మద్దతును ఉపసంహరించడమే,

nepal china relations కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: