సాధారణంగా సినిమాల్లో సైకో కిల్లర్ ని చూస్తుంటాం..అతి వద్ద ఉన్న పదునైన ఆయుధంతో అమాయకులను నిర్థాక్షిణ్యంగా చంపుతూ పైశాచిక ఆనందం అనుభవిస్తుంటాడు..అయితే కొన్నిసారి ఇవి నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. కొంత మంది జీవితంపై విరక్తి పుట్టి, ఎదురు దెబ్బలు తిని..సైకో గా మారుతుంటారు. అలాంటి వారు ఎంతటి దారుణానికైనా తెగబడుతుంటారు. ఇలా ప్రపంచంలో సైకో ల భారన పడి ఎంతో మంది అమాయకులు తమ నిండు జీవితాలను కోల్పోయారు.
తాజాగా హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సైకోగా మారి అత్యంత దారుణంగా ఆరుగురి ప్రాణాలు తీశాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన హరియానా రాష్ట్రంలో పెను సంచలనాలకు దారి తీసింది. ఓ వ్యక్తి రాడ్ తో సంచిరిస్తూ..తనకు ఎదురి పడిన వారిపై అత్యంత దారుణంగా దాడి చేస్తూ..కిరాతకంగా చంపాడు.
పల్వాల్లో ఈ ఉదయం వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. అతని దాడిలో ఆరుగురు ప్రాణాలో పోగా..మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఆదర్శ్ కాలనీలో గాయాలతో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన సైకో కి మతి స్థిమితం లేక పోవడం వల్ల జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
అతని పేరును ఆదర్శ్గా పోలీసులు వెల్లడించారు. ఓ మహిళతోపాటు, ముగ్గురు వాచ్మెన్లు మృతుల్లో ఉన్నట్లు వెల్లడించారు. మృత దేహాలను పోస్ట్మార్టంకు పంపించారు. నిందితుడిని ఫరిదాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మతిస్థిమితం లేకపోవడం వల్ల హత్యలు చేశాడా..లేక ఇతర కారణాల వల్ల హత్యలు చేశాడా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.