భారత దేశంలో ప్రతి రోజూ ఎక్కడో అక్కడ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా..కొంత మంది కామాంధుల తీరు మారడం లేదు. విశాఖపట్టణం జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాలిక అత్యాచారానికి గురైంది. ఈమె పని చేసే కంపెనీ బస్సు డ్రైవర్ విశ్వానాథ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సెజ్లో హైదరాబాద్కు చెందిన ఒక పరిశ్రమలో బస్సు డ్రైవర్గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన చింతాడ విశ్వనాథం పని చేస్తున్నాడు.
ఇదే కంపెనీలో తోట పనులు చేసేందుకుగాను అరకుకు చెందిన గిరిజన యువతిని పనిలో పెట్టుకున్నారు. శనివారం విధులు ముగించుకుని వెళుతున్న సమయంలో డ్రైవర్ విశ్వనాథం బస్సును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై బాలికను చితక బాది..వివస్త్రం చేసి వెళ్లాడు. విషయం అక్కడి సెక్యూరిటీకి తెలిసినా..బయటకు పొక్కనీయలేదు.
కాగా, బాలిక జీవితాన్ని ఆ కామాంధుడు బేరం ఆడాడు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు రూ. 1.50 లక్షలకు ఇచ్చేందుకు ప్రయత్నాం చేశాడు. బాధితురాలి సోదరుడు పాడేరు నుంచి వచ్చి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అత్యాచారం కేసును సుమోటోగా నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు విశ్వనాథ్ సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు.