మహిళలపై అత్యాచారాలు.. ప్రేమించి మోసం చేయడాలు.. వరకట్నం కేసులు... వివాహేతర సంబంధాల కోసం భార్యలను అడ్డుతొలగించుకోవడాలు.. ఇలాంటి వార్తలు రోజూ పేపర్లలో కనిపిస్తూనే ఉంటాయి. వీటన్నింటిలో పాపం మహిళలే బాధితులుగా ఉంటారు. కానీ ఇటీవల కాస్త ట్రెండ్ మారినట్టు కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల కోసం భర్తలను చంపేస్తున్న భార్యల ఉదంతాలు కలకలం సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ స్వాతి.. నిన్న ఓ జ్యోతి.. నేడు శ్రీవిద్య.. ఇలాంటి ఘాతుకాలు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి.



ఇక తాజాగా శ్రీవిద్య విషయానికి వస్తే.. ఈమెది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పునుగుపాడు. నరసరావుపేటలోని ఓ ప్రైవేట్  పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఈమె పనిచేస్తోంది.ఈమె భర్త నరేంద్ర పేరేచర్లలోని ఓ పరిశ్రమలో వాచ్ మెన్ గా డ్యూటీ చేస్తున్నాడు. ఈమె మూడుముళ్ల బంధాన్ని ..మూడున్నర ఏళ్లకే ఆమె ముక్కలు ముక్కలు చేసేసింది. ఏకంగా అక్క భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం భర్త కారణంగా సజావుగా సాగడం లేదని భావించింది. అదే భావ సహాయంతో ఏకంగా భర్తనే కాటికి పంపించేసింది. 

crime scene cartoon కోసం చిత్ర ఫలితం

శ్రీవిద్య భర్త నరేంద్ర.. డిసెంబరు 20న నాదెండ్ల మండలం పెదనందిపాడు బ్రాంచ్  కాలువ వద్ద శవంగా కనిపించాడు. మృత దేహం పక్కన సగం ఖాళీగా ఉన్న మద్యం సీసా ఉంది. దీంతో మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అంతా అనుకున్నారు. అనుమానాస్పద మృతి కావడంతో మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు విచారణ ప్రారంభించారు. అప్పడు కానీ శ్రీవిద్య రంకు బాగోతం బయటపడలేదు. 


శ్రీవిద్య ఫోన్ నుంచి తన అక్క భర్త వాసుకు లెక్కకుమించి కాల్స్ చేయడం పోలీసులకు అనుమానం రేకెత్తించింది. ఎందుకైనా మంచిదని వీరిద్దరిపై నిఘా ఉంచారు. దీంతో సింపుల్ గానే వీరి అక్రమ సంబంధం విషయం బయటపడిపోయింది. వాసు, శ్రీవిద్య మధ్య ఉన్న అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు  తేల్చారు. నరేంద్రను అడ్డు తొలగించుకునేందుకు శ్రీవిద్య, వాసు మాంచి క్రైమ్ ప్లాన్ రెడీ చేశారు. వాసు తన స్నేహితులతో కలసి నరేంద్రను ఓ వాహనంలో ఎక్కించుకెళ్లాడు. తోడల్లుడే కాబట్టి నరేంద్ర కూడా అనుమానించకుండా అతని వెంట వెళ్లి ఉంటాడు. గుంటూరు-కర్నూలు రహదారిలో కొత్తపాలెం వద్ద మద్యంలో విషం కలిపి తాగించారు. తర్వాత మృతదేహాన్ని పెదనందిపాడు బ్రాంచ్  కాలువ దగ్గర పడేసి చేతులు దులుపుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: