డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకున్న కొంత మంది అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ దందా..అక్రమాయుధాలు, హైటెక్ వ్యభిచారం తో అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. ఈ మద్య తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయినప్పటి నుంచి యువత, స్కూల్ విద్యార్థులు సైతం మాదక ద్రవ్యాలకు బానిసలైనట్లు తెలుస్తుంది. అయితే కొంత మంది దళారులు ఇలా బానిసలైన యువతులను వ్యభిచార రొంపలోకి తోస్తున్నారు.
అంతే కాదు బతుకు దెరువుకోసం వచ్చిన యువతులు, మహిళలను టార్గెట్ చేసుకొని వారికి మాయ మాటలు చెప్పి వ్యభిచారం లోకి దింపుతున్నారు. ఇక బ్యూటీ పార్లర్లు, మసాసా సెంటర్లు ముసుగులో వ్యభిచారం చేయిస్తూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు. పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటుచేసిన అసాంఘిక కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. గత డిసెంబరు మొదటి వారంలో బంజారా హిల్స్లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు, ఈ కేసులో ఇద్దరు బాలీవుడ్ నటీమణులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు రోజుల వ్యవధిలోనే ఎల్బీనగర్లోని ఓ మసాజ్ కేంద్రంగా సాగుతోన్న వ్యభిచారం బయటపడింది.
ఇలాంటి వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లడం మళ్లీ బయటకు రావడం..తమ కార్యకలాపాలు యథాతదంగా మొదలు పెట్టడం కామన్ అయ్యింది. తాజాగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న మరో స్థావరాన్ని పోలీసులు బయటపెట్టారు. మాదాపూర్ అరుణోదయ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు బుధవారం దాడి చేసి ముగ్గురు యువతులతోపాటు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోన్న మరో స్థావరాన్ని పోలీసులు బయటపెట్టారు.
మాదాపూర్ అరుణోదయ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు బుధవారం దాడి చేసి ముగ్గురు యువతులతోపాటు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా వీరి భారీ స్థాయిలో దందా మొదలు పెట్టారని..ఆన్ లైన్ ద్వారా విటులను రప్పించడం మహిళలను బెదిరించి తమ పనులకు ఒప్పించడం లాంటివి చేస్తున్నారట. వీరి నుంచి సెల్ఫోన్లు, రూ. 7,090 నగదు స్వాధీనం చేసుకొని నిందితులను మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. స్పా నిర్వాహకుడు విష్ణు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ మన్మథరావు తెలియజేశారు.