తమిళనాడు మాజీముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి తిరుపతి వెంకన్నపై చేసిన కామెంట్లు ఇటీవల కలకలం సృష్టించాయి. భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. ఇంతకీ కనిమొళి ఏమన్నది.. శ్రీవారికి శక్తులుంటే.. సెక్యూరిటీ ఎందుకు.. ఆయన కోటీశ్వరుల దేవుడు.. పేదవారికి కాదు.. అంటూ కామెంట్ చేసింది. అంతే కాదు..  యుద్ధంలో కంటే.. మత ఘర్షణల్లో చిందించిన రక్తం ఎక్కువ.. అంటూ తనదైన రీతిలో గతానికి భాష్యం చెప్పింది. ఐతే.. తిరుమలేశుడు కోటీశ్వరుల దేవుడు అన్న కామెంట్ కు స్పందించిన ఓ తెలుగు భక్తుడు ఆమె ఘాటుగా ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటో మీరూ చూడండి.. 

సంబంధిత చిత్రం

"అప్పా కనిమొళి !! మద్రాస్ నుండి సాయంత్రానికి ప్యాసింజర్ లో తిరుపతి రా, ఎదురుగా విష్ణునివాసంలో దుప్పటి పరువు,స్నానం గీనం చేస్కో, వేడి వేడి గా అన్నం వస్తుంది హయిగా తిను ఆరాత్రికి అక్కడే పడుకో అంతా ఉచితమే ! నయా పైసా కట్టక్కర్లా !! పొద్దున్నేలే రెడీగా ఉచిత బస్సెక్కి అలిపిరి చేరుకో, నీ మూటలన్నీ లారీల్లో ఉచితంగా పైకొస్తాయ్. మెల్లగా ప్రకృతిని ఆస్వాదిస్తూ మెట్లగుండా నడువ్, ఎక్కడన్నా ప్రకృతి పిలిస్తే పలకరించి రా ! బాత్రూమ్స్ అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయ్ ఫుల్లు ఫ్రీ !!


kanimozhi on tirumala కోసం చిత్ర ఫలితం
మధ్యలో షుగరు, బీపీ బిళ్ళలేస్కోడానికి గుండిగల్తో వేడెడి ఉప్మా, పొంగలి విస్తళ్ళల్లోకి తోడతా ఉంటారు ! తిని బిళ్ళేస్కో ఉడుకు పాలు తాగు, పైకి చేరుకో ఉచిత రూమ్ బుక్చేస్కో !! కొద్దిగ ఆలశ్యం అయినా ఉచిత దర్శనానికి వెళ్ళు. ఉచితంగా కొండంతా తిరుగు ! ఆకలైతే వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ లో ఎన్నిరోజులైనా, రోజుకి ఎన్ని సార్లయినా ఉచిత భొజనం తిను !! అప్పా కనిమొళి..... గుండుకూడా ఉచితమే, కాకపొతే కొన్ని చోట్ల కొద్దిగ టిప్పులు అడుగుతారు. మనం 2G స్పెక్ట్రమ్ లో తీస్కొన్న టిప్పులో ఇది ఏపాటి చెప్పు !! మరి నువ్వు చెప్పినట్టు పేదవాడిని దోచుకున్నదెక్కడ చెప్పు. నువ్ ట్రిచి దాకా వెళ్ళి ప్రక్కనే ఉన్న శ్రీరంగం ఎందుకు వెళ్ళలేదు ! 

social media కోసం చిత్ర ఫలితం

శతాబ్దాల చరిత్ర ఉన్న తమిళనాడులోని గుళ్ళన్నీ మీ దెబ్బకి గబ్బిలాలకు ఆవాసాల్లాగా  మారిపోయి మీ తమిళ భక్తులే రాక ఎలాంటి టైం లో అయినా అరగంటలో దర్శనాలు అవుతాయ్ !! అదృష్టం కొద్ది తిరుపతి తప్పించుకొంది గాని లేకపొతే ! అయినా తమిళనాడు మొత్తంమీద అమ్మ కాంటీన్లలో ఒక నెలరోజులలో అమ్మే ఆహారం ఒక్క పూట కొండమీద ఉచితంగా పెట్టే భోజనానికి సమానం కాదు!! నీ భాదేంటో నాకు తెలుసులే ఒక సంవత్సరంలో తిరుమలకి వచ్చే భక్తుల్లో సగంమంది తమిళులే ! అప్పా ఇప్పుడిప్పుడే ఎలక్షన్లు లేవు స్టాలిన్, అళగిరులని పక్కనెట్టి నువ్వు తమిళ "అమ్మ " అవ్వడానికి.... మా దగ్గర పావురాళ్ల గుట్టలని ఉన్నాయి ! అక్కడ చాలా చోటుంది, వెళ్తావేంటి !!"



మరింత సమాచారం తెలుసుకోండి: