ఈ మధ్య రాజకీయ నాయకుల కుమారులు నగరంలో తెగ హల్ చల్ చేస్తున్నారు.. తాజాగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కుమారుడు ప్రశాంత్రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. ఈ ప్రమాదంలో కారు బోల్తా కొట్టింది.. కానీ కారులో బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల వివరాల ప్రకారం... ఎమ్మెల్యే సతీమణి పుష్పలత, తనయుడు ప్రశాంత్రెడ్డి శుక్రవారం కారులో కరీంనగర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్నారు.
సుల్తానాబాద్ సమీపం లోని సేయింట్ మేరీస్ స్కూల్ వద్దకు రాగానే కారు టైరు పగిలి బోల్తాపడింది. అప్పటికే వేగంగా ఉన్న కారు ఉన్నట్టుండి బోల్తా పడి రెండు పల్టీలు కొట్టి చెట్టుకు ఢీకొట్టింది. వెంటనే ఏయిర్బ్యాగ్స్ ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి భార్య పుష్పలత, కుమారుడు ప్రశాంత్రెడ్డికి ప్రమాదం తప్పడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. సంఘటన స్థలం నుంచి బాధితులు పెద్దపల్లిలోని స్వగృహానికి చేరుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి ఇంటికి చేరుకున్నారు.