ఒకప్పుడు గురువు అంటే తల్లిదండ్రుల తర్వాత అంత గొప్ప స్థానం ఉండేది.  అందుకే గురు బ్రహ్మా..గురు విష్ణు..గురు దేవో మహేశ్వర అని త్రిమూర్తులతో పోల్చారు.  కానీ ఈ మద్య కొంత మంది గురువు స్థానంలో ఉండి ఛండాలం పనులు చేస్తూ..విద్యార్థునులపై లైంగిక దాడులు, అత్యాచారాలు చేస్తూ సమాజం సిగ్గు పడేలా చేస్తున్నారు.  ఇప్పటికే పలువురు గురువులు తమ విద్యార్థులను లైంగికంగా లోబర్చుకొని..బెదిరించి వారిపై అత్యాచారాలకు తెగబడుతున్నారు.  తాజాగా కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ చేసిన దారుణాలు విద్యార్థులు బయట పెట్టారు.

నేను సహకరిస్తే నీకు ఫుల్ మార్కులు వస్తాయి. నా చేతుల్లో ఉన్న స్పెషలైజేషన్ తీసుకో. పీజీ పరీక్షల్లో పాస్ చేయిస్తాను. అయితే నాకు కూడా నువ్వు సహకరించాలి. నా ఫోన్ నంబర్ తీసుకుని ఒంటరిగా వచ్చెయ్... ఇలా సాగుతాయి ఆ కీచక ప్రొఫెసర్ వేధింపు మాటలు. కొంతమంది విద్యార్థులను దారుణంగా  లైంగిక వేధింపులకు గురి చేశాడు.  కాకినాడ జేఎన్టీయూలో ఎంటెక్ మూడవ సంవత్సరం చదివే అమ్మాయిలే వాడి టార్గెట్.వైవా సమయంలో చెప్పరాని చోట్ల తాకుడూ తనను వేధించాడని గత నెల 30న ఓ ఎంటెక్ తొలి సంవత్సరం చదువుతున్న యువతి ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, ఆపై విచారణలో పోలీసులు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్ కె బాబులును ఎట్టకేలకు కాకినాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో గురువారం విలేఖరుల సమక్షంలో పోలీసులు బాబులును ప్రవేశపెట్టారు.  సదరు ప్రొఫేసర్ మొత్తం 23 మందిని ప్రొఫెసర్ వేదించారని తేలింది.
Image result for jail
తనను వ్యక్తిగతంగా వచ్చి కలవాలని అడిగేవాడని, పర్సనల్ విషయాలు చెప్పాలంటూ సందర్భం లేకున్నా తాకుతూ పైశాచికానందాన్ని పొందేవాడని అమ్మాయిలు ఫిర్యాదు చేశారు. శారీరకంగానూ అవమానించాడని, మాటలు, చేతలతో వేదనకు గురి చేశాడని పోలీసులకు చెప్పారు. దీంతో కేసును సీరియస్ గా తీసుకున్న కాకినాడ డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బాబులును అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: