"చంద్రబాబును తక్కువగా అంచనా వేస్తున్నారు. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పాడు - మరలా అదే జరగబోతుంది" అన్న రాయపాటి సాంబశివరావు వ్యాఖ్య లను ఏ కోణం లో చూడాలని "ఇది ఎలాంటి మిత్ర ధర్మం సూచిస్తుంది"
‘‘బీజేపీతో ఒకసారి పొత్తు పెట్టుకొని పదేళ్లు అధికారానికి దూరమయ్యారు! మరోసారి బీజేపీతో ఎందుకు పొత్తుపెట్టు కుంటున్నారని నేను చంద్రబాబును అడిగాను
"మేమిద్దరం కలిసి ఘనకార్యం చేస్తామని" చంద్రబాబు అన్నారు. ఆ ఘనకార్యం ఏమిటో ఇప్పుడు చూస్తున్నాం’’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు.
పై రెండు విషయాలను గమనిస్తే వీరి మైత్రి చెత్త కుప్పకు చేరినట్లే అనిపిస్తుంది. ఇక్కడ మిత్రధర్మం కనిపించట్లేదు కదా శత్రుత్వం తారస్థాయికి చేరినట్లే. ఇక బ్రేకప్ మాత్రమే ఆలశ్యం.
చారిత్రాత్మక కేంద్ర బడ్జెట్పై టీడీపీ నేతలు, కేంద్ర మంత్రిమండలిలో సభ్యులై ఉండి కూడా, రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు గతి తప్పి గీత దాటుతున్నట్లుగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలు లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరు లతో మాట్లాడారు. బడ్జెత్ చాలా విస్త్రుతమైనదని ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకు కావాల్సిన అవసరాలన్నీ బడ్జెట్ లో ప్రస్తావించడం కుదరదన్నారు.
పోలవరానికి కేంద్రం ఇప్పటికే రూ.4,300 కోట్ల నిధులిచ్చినా, ఏమీ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ పై గతంలో వేసిన ఒక కమిటీ అనుకూల నివేదిక ఇవ్వ లేదన్నారు. దీంతో సాంకేతిక సమస్య ఏర్పడడంతో బడ్జెట్లో పేర్కొనలేని అశక్తత పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రం లోను, రాష్ట్రం లోను మంత్రిగా చేసి, నేడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతున్న విధానం ఆశ్చర్యంగా ఉందన్నారు.
"చంద్రబాబును తక్కువగా అంచనా వేస్తున్నారు. గతం లో బీజేపీకి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పాడు - మరలా అదే జరగబోతుంది" అన్న వ్యాఖ్యలను ఏ కోణం లో చూడాలని "ఇది ఎలాంటి మిత్ర ధర్మం సూచిస్తుంది" ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్న.
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఎవరైనా విమర్శలు చేస్తే కాంగ్రెస్ కోవర్టులనడం రాయపాటి సాంబశివరావుకు అలవాటుగా మారిందని, కానీ ఆయన ఎక్కడి నుంచి ఊడి పడ్డాడు? పొగాకులో రాళ్లు పెట్టి చైనాకు అమ్మాడు" అంటూ ఆయన ధ్వజమెత్తారు.
"కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి పడుతుందని" టీజీ వెంకటేశ్ అంటున్నాడని, ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసి రాష్ట్రం లో ఎలా గెలిచారో అందరికీ తెలుసున్నారు.
ఇలాంటి వారా తమను హెచ్చరించేది? ఇదేనా మిత్రధర్మం? అంటూ ప్రశ్నించారు. కేంద్రం రూ.21వేల కోట్ల ఉపాధి హామీ నిధులు మంజూరు చేస్తే రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు దాన్ని తమకు ఉపాధిగా మార్చుకున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. విలేకరుల సమావేశానికి ముందు కలెక్టరేట్ వద్ద బీజేపీ జిల్లా శాఖ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా డా. వైఎస్ రాజశేఖర్రెడ్డి 2005 లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అంతకు ముందు 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఆ పని చేయలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరు లతో మాట్లాడారు.