యూరిలో ఉగ్ర‌వాదులు భార‌త సైనికుల‌పై దాడి జ‌రిపి వారిని బ‌లిగొన్నందుకు భార‌త్ ప్ర‌తికారం తీర్చుకోవాల‌ని చూస్తున్న వేళ పాకిస్థాన్ ఆర్మీ మ‌రోసారి అదే సెక్టార్‌లో నేడు దుస్సాహ‌సానికి దిగింది. మరోసారి కాల్పుల విరమణ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించింది. కొంత కాలంగా యూరీ సెక్టార్ లోని హాజీపీర్ వద్ద పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచాయి. మోర్టారు షెల్స్, శతఘ్నులను ప్రయోగించుకునేంతవరకు పరిస్థితి చేజారడంతో.. ఆదివారం తెల్లవారుజాము నుంచే మసీదుల్లోని లౌడ్‌ స్పీకర్లను వినియోగించి సరిహద్దుల్లోని గ్రామాలు ఖాళీ చేయాలంటూ భారత సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. 
Image result for యూరీ సెక్టార్‌
ఉగ్రవాదులు చొరబడ్డారు అన్న సమాచారం తో అక్కడ తనిఖీ లు నిర్వహిస్తున్న భద్రతా దళాలు.  కొండలు, గుట్టలతో ఉగ్ర చొరబాట్లకు అనుకూలంగా ఉండే ప్రాంతం. 2003లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇరు దేశాల సైన్యాలు శతఘ్నుల వినియోగాన్ని నిలిపివేయగా, సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భారీ శతఘ్నలను ఉపయోగించి ఇరు పక్షాలను పరస్పరం దాడులుచేసుకున్నాయి. దీంతో అక్కడ నివసించే దాదాపు 8000 మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Image result for యూరీ సెక్టార్‌
నిన్న ఉదయం 11.50 సమయంలో పాక్‌ సైన్యం ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఆ తరువాత సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతోందని, పాక్ కాల్పులకు దీటుగా భారత సైన్యం జవాబిస్తోందని శ్రీనగర్‌ లోని రక్షణశాఖ ప్రతినిధి రాజేష్‌ ఖలియా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: