లోకంలో ఎంత దుర్మారం ఉందో.. ఈ ఘటన ఒక్కటి చదివితే చాలు ఆర్థం చేసుకోవచ్చు.. ఓ వైపు పిడికెడు ఆహారం కోసం ఆకలి కేకలు ఉంటే.. మరోవైపు..అదే ఎండిన దేహాల నుంచి సెక్స్ కోరిక తీర్చుకోవాలన్న కామాంధులు కూడా ఉండటం దారుణం.. ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసా.. ఈ ప్రపంచంపై ఇప్పుడు అత్యధికంగా హింస చెలరేగుతున్న సిరియా దేశంలో. 


కొన్నాళ్లుగా సిరియా అంతర్యుద్ధం కారణంగా అడ్డుడుకుతోంది. నగరాలకు నగరాలే శిథిలమవుతున్నాయి. ఇక్కడి మహిళల సంగతి మరింత దుర్భరం.. అయితే మానవత్వం పేరుతో వీరికి సహాయం చేసేందుకు వచ్చిన విదేశీ సహాయక బృందాలు స్థానిక ముస్లిం యువతులను తమ లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న వాస్తవం కలకలం సృష్టిస్తోంది. 


మహిళలు సహయ కేంద్రాల్లో సహయం పొందాలంటే అక్కడ పనిచేసే పురుషులకు తమ సర్వస్వాన్ని అర్పించాల్సి వస్తోందట. తమకు భోజనం కావాలంటే సహయక 
కేంద్రాల్లో పనిచేసే పురుషుల దగ్గర పడుకోవాల్సిన దారణమైన పరిస్థితులు ఉన్నాయట. చివరకు పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. అక్కడికి వెళ్తే శీలం కోల్పోక తప్పదన్న భయంతోనూ.. అక్కడికెళ్తే తమ గురించి కూడా జనం కూడా తమను అలాగే భావిస్తారన్న భయంతో మహిళలు సహాయ కేంద్రాలకు వెళ్లడమే మానేశారట. 



మరింత సమాచారం తెలుసుకోండి: