తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తిగా పవన్ కళ్యాన్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించారు.  కాకపోతే అప్పుడు ఎన్నికల్లో మాత్రం పాల్గొనకుండా బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికారు.  ఇప్పుడు జనసేన ఏర్పడి నాలుగు సంవత్సరాలు అయ్యింది.


వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయాలని సంకల్పించిన పవన్ కళ్యాన్ పార్టీ పటిష్టత పెంచేందుకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీ నేతలను కలుపుకొని పోరాటం కొనసాగిస్తున్నారు.  పవర్ కోసం కాదు..ప్రశ్నించడానిక వస్తున్నా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు పవన్ కళ్యాన్. 


నేడు జనసేన నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ గుంటూరులో అట్టహాసంగా మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనంతో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా వున్న గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. పార్టీ ప్లీనరీగా వ్యవహరిస్తున్న ఈ సభలో అధినేత పవన్ కళ్యాణ్ చేయబోయే ప్రసంగంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: