భారత దేశంలో రోజు రోజుకీ మహిళలపై కామాంధులు అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా ప్రతిరోజు ఎక్కడో అక్కడ యువతులు, మహిళలు బలి అవుతూనే ఉన్నారు. ఓ వైపు ప్రభుత్వం నిర్భయ చట్టం అమలు చేస్తున్నా..ఇలాంటి కామాంధులు లేక్కచేయడం లేదు. తాజాగా ఓ యువతి తన ప్రేమ నిరాకరించిందని దారుణంగా నిప్పంటించి సజీవ దహనం చేయాలని ప్రయత్నించాడు..ఈ దారుణం హైదరాబాద్ లో జరిగింది.
వివరాల్లోకి వెలితే.. గంగానగర్లో నివసించే రియాజ్ ఖాన్, అర్షియా బేగం దంపతుల కుమార్తె (17) చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. గోల్నాక కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేసే మహ్మద్ సోహైల్ (19) ప్రేమ పేరుతో ఆ యువతిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆ యువకుడిని యువతి తల్లిదండ్రులు పలు మార్లు మందలించారు. అంతే కాదు యువతికి వేరే వ్యక్తితో 15 రోజుల కిందటే నిశ్చితార్థం కూడా చేశారు.
ఈ సంగతి తెలుసుకున్న సోహైల్ ఆవేశంతో యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి ఆమెను నిలదీశాడు. తననే పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తానని భెదిరించాడు..దీంతో వారిద్దరి మద్య మాటా మాటా పెరిగిపోయింది. దీంతో ఆవేశానికి లోనైన సోహైల్ అక్కడే ఉన్న కిరోసిన్ తీసుకుని ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు.
బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని 108లో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సోహైల్కు కూడా నిప్పంటుకోవడంతో అతన్ని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులకు కఠినంగా శిక్ష పడాలని స్థానికులు కోరుతున్నారు.