వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని మోడీ కాళ్లకు నమస్కరించి యావత్ ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని  దెబ్బతీశారని తెలుగుదేశం పార్టీ సభ్యుడు సీఎం రమేష్ వాఖ్యానించిన సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి పార్లమెంట్‌లో మోడీ కాళ్లపై పడతారని, అక్కడనుండి బయటకు రాగానే సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తారని ఒక స్థాయిలో విమర్శించిన సంగతి తెలిసిందే.


ఇక ఈ వాఖ్యలను విజయసాయిరెడ్డి కూడా బాగానే తిప్పికొట్టాడు. అసలు నిజం తేల్చడంకోసం సభలోని సీసీ టీవీ ఫుటేజీలను బయటపెట్టడానికి  కూడా వెనకాడలేదు. ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడే పడినట్లు, విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసిన సీఎం రమేష్ ఇప్పుడు తానే ఇరకాటంలో పడ్డారు.


తెలుగు దేశం అధినేత, సీఎం చంద్రబాబు కాళ్లపై పడి నమస్కరిస్తున్నట్లుగా ఒక వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఎప్పుడెప్పుడా అని సమయం కోసం వేచి చూస్తున్న వైసీపీ శ్రేణులు ఈ వీడియోను ఒక విమర్శల అస్త్రంలా వాడుకుంటున్నారు. మనం వంగడం ముందు పక్కవాళ్ళు వంగడం ఎంతలే రమేషా అంటూ చలోక్తులు విసురుతున్నారు. అంతేకాక చంద్రబాబు వద్ద తాను అతి వినయం ప్రదర్శించిన ఫోటోలను సైతం బయటికితోడి మరీ జోకులు పేలుస్తునారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: