గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కిమ్స్లో రేడియేషన్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థతి ఆందోళనకరంగా ఉండటంతో వైద్య నిపుణులు ప్రత్యేక వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని వారాలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు.
గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశంలో చేరిన కొంత కాలానికే..ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం పార్టీ వర్గాలు తీవ్ర ఆవేదన గురయ్యారు.
ఇటీవల ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించిన విషయం తెలిసిందే. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.